పుట:Gopinatha-Ramayanamu1.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాజవంశంబుల శతగుణితంబులఁ బ్రత్యేకంబుగా రాజ్యదానంబున సంస్థాపించి
యసంఖ్యేయం బగుధనంబును గోకోటిసహస్రంబులను బ్రాహ్మణుల కొసంగి
యీలోకంబునందు నాల్గువర్ణంబులవారిని స్వస్వధర్మనిరతులం జేసి పదునొకొం
డువేలవత్సరంబులు రాజ్యంబుఁ జేసి స్వలోకం బైనవైకుంఠంబునకు వేంచే
యఁగలండు.

120


క.

అనఘము శ్రుతినిభము శుభం, బనుపమసేవ్యంబు దురితహర మగునీరా
మునిచరితముఁ బఠియించినఁ, జనుఁ డఘములఁ బాసి పొందు శాశ్వతసుఖమున్.

121


క.

ఆయుష్యం బగు నీరా, మాయణముఁ బఠించు మనుజుఁ డైహికసౌఖ్య
శ్రీయుతుఁడై సుతపౌత్రస, మాయుక్తుం డై యమర్త్యుఁ డగు నటమీఁదన్.

122


ఉ.

భోగము మోక్ష మిచ్చురఘుపుంగవ దోశ్చరితప్రబంధముల్
బాగుగ విన్న విప్రనరపాలకవిట్పదజు ల్క్రమంబున
న్వాగృషభత్వమున్ క్షితిధవత్వముఁ బుణ్యఫలత్వము స్సము
ద్యోగమహత్త్వముం గలిగి యొప్పుదు రెంతయు వీతశోకులై.

123


వ.

అని యి ట్లుత్తరకాండకథాసమన్వితంబుగా సప్తకాండకథావృత్తాంతం బం
తయు సంక్షేపంబుగా నెఱింగించిన వాక్యవిశేషజ్ఞుండును ధర్మాత్ముండును మహా
మునియు నగువాల్మీకి యన్నారదుని సంపూర్ణార్థప్రతిపాదకపదసమూహరూపం
బైనతత్ప్రశ్నానురూపోత్తరవాక్యంబు విని శిష్యసహితుండై యద్దేవర్షివర్యుం
బూజించిన నన్నారదుం డవ్వాల్మీకిచేత యథార్థంబుగాఁ బూజితుండై యా
మంత్రణంబు వడసి యాకాశంబున కుద్గమించి స్వల్పకాలంబులోన బ్రహ్మలో
కంబునకుం జనియె.

124

వాల్మీకి స్నానార్ధము తమసానది కరుగుదెంచుట

ఉ.

ఆజటినాథుఁడుం జనిన యవ్వల నమ్ముని స్నానకాంక్షి యై
యోజ దలిర్ప డెందమున నూరెడుభక్తిరసంబుతో భర
ద్వాజుఁడు వెంట రా వికచతామరసోత్పలభూరిసౌరభ
భ్రాజితదివ్యగంధవహబంధుర యౌ తమసాస్రవంతికిన్.

125


క.

చని తత్తటినీమహిమకు, జనితప్రమదాభియోగసంభ్రమమతి యై
ఘనసుజనావనపావన, వనగాహన మాచరింప వడిఁ దివురు చెదన్.

126


తే.

తగ నకర్దమ మైనయత్తటినితీర్థ
మది విలోకించి తనక్రేవ నతివినీత
చిత్తుఁ డై యున్న యమ్ముఖ్యశిష్యునిఁ గని
యింపు దళుకొత్త మధురోక్తి నిట్టు లనియె.

127


ఆ.

అనఘ కంటె రమ్యమై నిష్కళంక మై, స్వాదుయుక్త మై, ప్రసన్నసలిల
మై నుతింప నయ్యె నీనదీతీర్థంబు, సాధుపురుషమానసంబుకరణి.

128