పుట:Gopinatha-Ramayanamu1.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

9


బాండ్యకిరీటంబు బలిమిచేఁ గొన్నమాధవభూధవుం డెందు నవతరించెఁ
బటుశక్తి శింగభూపాలీయ మనెడి యలంకారశాస్త్రంబు లలి రచించి
యరుదారరాయవేశ్యాభుజంగుండన బిరుదుఁగాంచి యుదారచరితుఁ డగుచుఁ
జెలువొందుసర్వజ్ఞశింగభూపాలుఁ డే యమలాన్వయంబున నవతరించె


తే.

నట్టివెలుగోటివంశమం దవతరించి, వెలయ రేచర్లగోత్రపవిత్రుఁ డగుచు
వీరవర్యుండు విద్వత్కుమారయాచ, జనవిభుం డప్పురం బేలెఁ జతురుఁ డగుచు.

57


తే.

విశ్వనాథప్రతిష్ఠఁ గావించి వెలసి
నట్టిపుణ్యుండు బంగారుయాచవిభుఁడు
తనయుఁడై పుట్టె నతని కాధరణివిభుఁడు
విమలునిఁ గుమారయాచభూవిభునిఁ గాంచె.

58


తే.

ధన్యుఁడగు రాజమౌళికిఁ దనయుఁ డగుట
విబుధగణములఁ బ్రోచువివేకి యగుట
పొసఁగఁ దారకహరయశఃస్ఫూర్తి గనుట
యామహీనేతకుఁ గుమారనామ మమరె.

59


చ.

వెలయఁగ నన్నరేశ్వరుఁడు విష్ణుపురాణము నాంధ్రభాష నిం
పలర రచింపఁ జేసి దనుజారికృపాప్తికిఁ బాత్రభూతుఁడై
చెలఁగి జగంబులం గడుప్రసిద్ధికి నిక్కఁగ విశ్వనాథు ని
శ్చలవిభవంబులం దనిపి చక్కఁగఁ దత్కృపఁ గాంచె నుర్వరన్.

60


తే.

ఆమహారాజునకుఁ బుత్రుఁ డతిపవిత్రుఁ, డాదిరాజనిభుండు దివ్యప్రభుండు
దానమానధనుండు విద్యాఘనుండు, వఱలు బంగారుయాచభూపాలమౌళి.

61


చ.

అరులకుఁ గాలదండ మఖిలార్థులకు న్సురశాఖిశాఖ భూ
భరము ధరింప భోగి జయపద్మకుఁ జక్కని జీవగఱ్ఱయై
పరఁగు జయాభిరాముఁ డగుబంగరుయాచమహీవరేణ్యుసు
స్థిరతరబాహుదండ మని ధీవరు లెన్నఁ జెలంగు చిమ్మహిన్.

62


శ్రీవెలుగోటిసర్వజ్ఞకుమారయాచేంద్ర భూపాలప్రశంస

ఉ.

ఆజ్ఞకు బద్ధులై నృపతు లందఱు గొల్వఁగఁ బెక్కువర్షముల్
విజ్ఞులు మెచ్చ ధాత్రి నతివిశ్రుతవైఖరి నేలె నమ్మహా
ప్రాజ్ఞున కుద్భవించె నిరపాయమహావిభవోన్నతుండు స
ర్వజ్ఞకుమారయాచనరపాలుఁ డమేయగుణాభిరాముఁడై.

63


మ.

గణనాతీతగుణోన్నతుండును ద్రిలోకఖ్యాతచారిత్రుడుం
బ్రణుతప్రాభవుఁ డివ్విభుండు ధ్రువుఁడో ప్రహ్లాదుఁడో యావిభీ
షణుఁడో యంచు బుధు ల్నుతింప భగవత్సంసేవనాస క్తవీ
క్షణచిత్తంబులకుం బ్రియుం డగుచు నాక్ష్మాభర్త ప్రోచు న్మహిన్.

64