పుట:Gopinatha-Ramayanamu1.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

గోపీనాథ రామాయణము


మ.

అనిశంబున్ ద్విజకోటిచే మఖము లుద్యత్ప్రీతిఁ జేయించి యో
దనదానంబున మర్త్యులన్ బహుహవిర్దానంబులన్ వేల్పులం
దనియం జేసి మహీసుపర్వులకు నందం బొప్ప భూవస్త్రగో
ధనదానంబు లొసంగి మించి శుచియై ధన్యాత్ముఁడై యుర్వరన్.

65


సీ.

అలతర్కశాస్త్రయుక్తు లుపన్యసించుచో, గణుతింప రెండవగౌతముండు
బహువిధశబ్దనిష్పత్తిఁ గావించుచోఁ, దలపోయ నపరపతంజలి యగు
నఖలవేదాంతశాస్త్రార్థతత్త్వవిచారమందు సాక్షాజ్జనకాధిపుఁ డగు
లలిఁ గావ్యనాటకాలంకారకవితాప్రముఖవిద్యలం దన్యభోజనృపతి


తే.

యుత్తరోత్తరయుక్తి నొండొకసురేజ్యుఁ, డతులగాంధర్వవిద్యయం దనుపమాను
డనుచు జనములు దనుఁ గొనియాడ వాసి, కెక్కె సర్వజ్ఞయాచమహీవరుండు.

66


తే.

ధరణి నెవ్వానికీర్తిప్రతాపరుచులు, వరుస నిఖలదిశాంగనావక్షములకు
సరసచందనకాశ్మీరచర్చ లయ్యె, నన్నరేంద్రుని గీర్తింప నలవి యగునె.

67


వ.

ఇట్లనన్యసామాన్యప్రభావుండై రాజ్యంబుఁ జేయుచు నారాజన్యశేఖరుండు
భారత భాగవత రామాయణ ప్రముఖ నిఖిలపురాణంబులఁ బరిశోధించి భాస్క
రాదులు రచించిన యాంధ్రరామాయణంబులందు వాల్మీకివిరచిత శ్రీమద్రా
మాయణంబునం గలయర్థం బంతయు సమగ్రంబుగాఁ గథితం బైనయది గా
దనియు భగవదంకితంబు గా కున్న వనియుఁ దలంచి యిమ్మహాకావ్యంబు గీర్వా
ణంబున కన్యూనానతిరిక్తంబుగా భగవదంకితంబుఁ జేసి యాంధ్రభాష రచి
యింప సమర్థుం డగుపండితుం డెవ్వండో యని విచారించుచు నే నిక్కావ్యంబు
గీర్వాణంబున కనురూపంబుగాఁ బద్యప్రబంధంబుఁ గావించుట యంతయు
విని ప్రీతిపూర్వకంబుగా నన్ను రావించి యొక్కనాఁడు సువర్ణమణిగణస్థగి
తంబై సుధర్మకు సాటి సేయం దగినసభామండపంబున నగణితమణిగణప్రభా
పటలజటిలంబైన భద్రపీఠంబున సుఖాసీనుండై యుదయమహీధరశిఖరో
పరిస్థితుండైన లోకభాంధవునిభంగి వెలుంగుచు సకలవిద్వజ్జనంబులు పరివే
ష్టింప బృందారకపరివృతుం డగు సహస్రాక్షునిచందంబున నందం బగుచు
మద్విరచితం బైన యాంధ్రరామాయణకావ్యం బంతయు సమగ్రంబుగా
నత్యాదరంబున నాకర్ణించి యిది మదీయాభిప్రాయప్రకారంబున గీర్వాణంబున
కనురూపంబై శ్రీకృష్ణాంకితంబై యున్న దని బహూకరించి పరమానందభరి
తాంతఃకరణుండై చారుచామీకరకటకాంగుళీయకహారాగ్రహారాధిప్రదా
నంబుల నన్ను సత్కరించి పరమభాగవతోత్తముండును శ్రీ రామచంద్రచరణ
సేవాసంసక్తచిత్తుండును గావున లోకహితార్థంబుగా నిమ్మహాపుణ్యకావ్యం
బు జగంబునందు విస్తరిల్లం జేసి శ్రీరామభద్రుని యపారంబైన కృపారసంబు
నకుఁ బాత్రభూతుం డయ్యె.

68