పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
35

మంగళవారంనాడు, పసుపు కొమ్మును పూజించి దానిని కర్పూరంతో అరగదీసి గౌరీ ప్రసాదంగా స్వీకరించి, దీనితో స్నానం చేయడం ఒక వ్రతనియమం. దీనివాళ్ళ తరుణవయసు పిల్లకు శరీర దుర్గంధం, రోమములు, ఋతుబాధలు పరిహరించబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

"వీనిని కన్యకలు అయిదవతనము నిమిత్తమును, ఐశ్వర్యం నిమిత్తమును, సవతి పోరు లేకుండు నిమిత్తమును, ముఖ్యముగా నోచు కొనుచూ వచ్చిననూ, వీని ఆచరణవలన సదాభ్యాసములు, దైవభక్తి, ఆస్థిక భావములు, పాపభీతి, ధర్మానురక్తి కలిగి బాలికలకు చక్కని శిక్షణ ఏర్పడెడిది. వీనిలో కొన్ని స్త్రీలనేకులు కలిసి నోచుకొనునవి, ఆచరిన్చునవి ఆగుటచేత ముందుముందు సమిష్టికుటుంబంలో భాగాస్వామినియగు బాలికకు పరస్పర సహకారము, ప్రేమ, మైత్రి మొదలగు గుణములు బీజములుగా నాటి ఆమెలో ఉత్సాహమును పెంపొంచించుచు వచ్చినవి."

ఈ నోములనేవి పదకొండవ శతాబ్ధి నాటికే అనేది నన్నయగారి మహాభారతంలో శకున్తలోపాఖ్యనంలోని ఈ క్రింది పద్యం వల్ల తెలుస్తోంది.

నుడువులు వేయు నింకేల యిప్పటి
నోముల దొల్లి కడగి నోచితిని గాకేమి "

వ్రతాలు

ఆర్త జనులకు అభయ హస్తాలు జానపదులు వ్రతాలు.

మానవ జీవితం సహజంగా కశ్తాలపుట్ట. కొందరికి ఆకలి బాధ-కొందరికి ఆరోగ్య బాధ-కొందరికి సంసార బాధ-కొందరికి సంతాన బాధ. ఇలా ప్రతిమనిషికి ఏవోబాధలే. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా యీప్రపంచంలో కొట్టుమిట్టాడే మనిషికి దుఃఖోపశమనం కోసం ఎదో ఒక ఓదార్పు కావాలి. ఆ ఓదార్పులే యీవ్రతాలు. ఈ వ్రతాలకు ఆరాధ్యుడు దేవుడు. ఆ దేవుని అనుగ్రహానికి పెద్దవాళ్ళు చెప్పిన యమనియమానస ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధివంటి పద్ధతులను ఆచరించడం


*విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి