ఓమ్
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
సప్తదశాధ్యాయము.
శ్రద్ధాత్రయవిభాగయోగము
అర్జునుడిట్లనియె :-
01. తే.ఎవరు శాస్త్రీయపద్ధతు లెల్ల విడిచి
శ్రద్ధ వహియించి యజ్ఞముల్ సల్పుచుంద్రు
అట్టివారలనిష్ఠ నేమందుఁ గృష్ణ !
సత్త్వమా? రాజసమ? తామసంబ? చెపుమ.
శ్రీ భగవంతుడిట్లనియె :-
02. తే.శ్రద్ధ త్రివిధములుగ సర్వజనులకు స్వ
భావజనిత మగుచుఁ బరఁగుచుండు;
సాత్త్వికంబు రాజసంబును మఱి తామ
సంబు ననెడువిధుల సవ్యసాచి!
03. తే.సర్వజనులకుఁ దమమానసస్వభావ
మనుకరించెడుశ్రద్ధయే తనరుచుండు;
శ్రద్ధయే పూరుషుండు; ఏ శ్రద్ధ నెవఁడు
పూనియుండునొ వాఁడట్టి పురుషుఁడగును.
04. తే.దేవతలను యజింత్రు సాత్త్వికజనములు
రాజసులు గొల్త్రు యక్షుల రాక్షసులను
అన్యజనములు భువిఁ దామ సాఖ్యఁ జెలఁగి
పూజ లొనరింతు రలప్రేత భూతములకు.