పుట:Garimellavyasalu019809mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధణధణలును ఆవేశములచే యెంత మాత్రము కాదనియు, వీరి తాలూకు సవిర్శన ప్రాచీనార్వాచీన ప్రసిద్ధ గ్రంధ పఠనము మాత్రమే యనియు, వీరి యనుశాసనపాఠకు లెల్లరకు ఇదితము కాగలదు. వీరను శాసించిన శబ్దములును రూపములును అనేకము పూర్వకవిగ్రంధస్థములై యుండుట మనకు గోచరము కాగలదు. అయినను వీరి మార్పులకును శ్రీరామమూర్తి పంతులుగారు కావలననుచున్న మార్పులకును భేదము, పోవలసిన మేఱలో హెచ్చుతగ్గులు కాని, దిక్కులో భేదమెంత మాత్రమును కాదని సువిదిరము. రామమూర్తి పంతులు గారును వీరును కూడ సాంప్రదయ పద్దతినే అభిలషించుచున్నారు. అతని పద్దతియూ పరిశ్రమయూ అతనిని మరికొంతదూరమెక్కువగా సాహసించి తీసుకొని పొవుచుండగా ఇతని పద్దతియు పరిశ్రమయు ఇతనిని కొంచెము దూరము మాత్రమే తీసుకొనివచ్చి నిస్సంశయ మైనట్టియు, నిపుణమైనట్టియు, సౌందర్యవంత మైనట్టియు సుప్రసిద్ధ కవీంద్ర గ్రంధ సంస్థిత ప్రయోజనములకు మాత్రమే కాక వాటి పొలిమేరలో గూడ క్రీడించుట కుత్సాహమును పురిగొల్పినవి. ఇందుచేతనే వీరి గ్రంధప్రయోగము లేక వాడుకలోనుండు పుచ్చుకు, తీసుకుకామోసు మొదలగు వాటికనుశాసనమిచ్చియు వాడుకలో ఉండి ప్రయోగ గౌరవము నందిన ఇస్తిని, వచ్చీనా, కూర్చొను మొదలగు మనోహర అదములకును రూపములకును అనుశాసన మీయక తాము "ప్రమాణముగా గొప్ప "ప్రయేగౌలం వ్యాకరణ" మన్ నార్యోక్తి నిప్పటికి మీఱిన వాడనైతిని" అనుటయు "మటీయుననుశాసించిన శబ్దముల నీయనుశాసనమున నిపుడుపయోగింపక భాషా సంప్రదాయ వేత్తల యనుమతికై దృష్టి నిలిపితిని" అనుటయు సంభవించినది.

   అయినను శాస్త్రి గారి వంటి సనాతన గ్రాంధిక శైల్యభిమానులే అతివాదులనబడువారికంటె ముందుగా ముందంజవేసి, భాషాతత్వమునూ, మార్పు లక్షణములనూ తాము గురర్తెఱింగి అనుశాసన రూపకముగా ఒరులకు చాటుట మన ఆంధ్రభాష యొక్క భావ్యభివృద్ది సూచకమని నిజమైన భాషాభిమానులెల్లరి తలపైయున్నది. శాస్త్రి గారు చూపిన ప్రమాణము లెల్లయు లేఖక పాఠక రచయిత ప్రమాదములని తృణీకరించుట వీరగ్రాంధికుల మతమై యున్నది. మార్పేవద్దని కొమ్మమీద కూర్చొను వారికి ఇది ప్రశంసా