Jump to content

పుట:February 2020.అమ్మనుడి.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తలంచి 'కన్నవిడ్డల గుండె చప్పుడు” అనే ఉపశీర్షికతో గ్రంథం లోపలికి తొంగి చూడాలనే ఉత్సుకతను కలిగిస్తున్న గ్రంథం.

మన సమాజంలో వివిధ రంగాలలో పేరు ప్రఖ్యాతులు సాధించిన రచయితలు, కళాకారులు, వైద్య, విద్యా పారిశ్రామిక తదితర రంగాలలో నిష్టాతులై శిఖరాయమానంగా ఎదిగిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారి అభివృద్ధిని, విజయాలను వివరించే పలు కార్యక్రమాలు వివిధ పత్రికలలో, ఛానళ్ళలో వెలువడ్డాయి. ఆ క్రమంలో 'నది” మాస పత్రికలో డా॥ భవానీదేవిగారు “తల్లీ! నిన్ను తలంచి” శీర్షికను ప్రముఖ వ్యక్తుల విజయాలకు ప్రేపేరణ నందించిన వారివారి మాతృమూర్తుల ఔన్నత్వాన్నీ త్యాగాలను వివరిస్తూ ముఖాముఖి రూపంలో దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు ధారావాహికగా నిర్వహించారు. వినూత్నంగా సాగిన ఆ శీర్షికలో భవానీదేవి గారు పాఠకులకు పరిచయం చేసిన 53 మంది ప్రముఖుల జీవితాలలో వారి మాతృమూర్తి కలిగించిన ప్రేరణను ఈ [గ్రంథ రూపంగా అందించటం ముదావహం.

పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత దాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి మొదలుకొనీ రచయిత్రి తనకు, తన మాతృమూర్తితో కల అనుబంధాన్ని వెలువరించినంత వరకు వివిధ రంగాల ప్రముఖుల అంతరంగాలు ఈ పుటలలో ప్రతిఫలించాయి. వారివారి తల్లుల ప్రేరణను గురించి ఆవిష్కరించిన తావులలో వారి ఛాయాచిత్రాలతో పాటు వారి తల్లుల ఛాయా చిత్రాలను కూడ పొందు పరచటం ఈ గ్రంథానికి వన్నె తెచ్చింది. శీర్షిక ఉపోద్దాతంలో తల్లి ఔన్నత్యాన్న వైశిష్ట్యాన్ని వెల్లడించే వేదోపనిషద్వాక్యాలను, సంస్కృతాంధ్ర ప్రాచీనార్వాలీన కవుల పద్య రాజులను, వచన కవితలను ఉట్టంకించిన తీరు కవయిత్రి సాహిత్యాభినివేశాన్ని తేటతెల్లం చేస్తుంది.

మహాభక్తురాలు బెజ్జమహాదేవి పరమశివుడిని బిడ్డగా భావించుకొని, తల్లిలేని శివునికి తానే తల్లియై పరిచర్యలు చేసింది.

“తల్లిగల్లిన నేల తపసిగానిచ్చు / తల్లి గల్గిన నేత తలజడల్లట్టు” అని బాధపడిన వైనాన్ని వర్ణించిన పాల్కురికి సోమనాథుడి నుండి “పాత చీరల్ని కాలం దారంతో కుట్టిన / బొంత మీద పడుకున్నప్పుడు అమ్మ అరచేతుల్లో పడుకున్నంత ఆనందం / అమ్మ చేతి చిత్ర వర్ణం బొంత” అంటూ తన ఆవేదనను అక్షరీకరించిన శ్రీ ధేనువకొండ శ్రీరామమూర్తిగారు 'అమ్మఒడి” దీర్చ కవితలోని పంక్తుల వరకు భవానీదేవిగారు అమ్మపై కవులు వెలువరించిన అభిప్రాయాలను చక్మగా అలంకరించారు. ఈ వినూత్నమైన విధానం రచనకు కావ్యత్వ శోభను కలిగించిందని పేర్యొానవచ్చు.

భావానీదేవిగారు స్వయంగా తమ తల్లిపట్ల అపారమైన మమతానురాగాలను నింపుకున్న స్తీ మూర్తి కనుక ఈ గ్రంథం ఆద్యంతమూ ఒక ఆర్ద్రత అనే అంతస్సూత్రంతో సాగింది. సాహిత్యలోకంలో ఈవిధమైన రచనలకు నాందిగా పేర్కొనదగిన ఈ గ్రంథాన్ని తమ మాతృమూర్తికే అంకితం కావించటం సమంజసం, సార్థకం. దీనిలోని ప్రతి అక్షరం శిలాక్షరమై, సుదీర్ణమైన అస్తిత్వాన్ని పొందుతుంది. చదివిన ప్రతి ఒక్కరికీ వారి అంతరంగంలో ఆమించిన అమ్మ జ్ఞాపకాలను ఉద్దీప్తం చేస్తుంది. మాతృమూర్తి పట్ల తమ ఆరాధనా భావాన్ని వెలువరించిన ఒక్కొక్కరి గాథ మనస్సు లోగిళ్లను తెరిచి దివ్యమైన వెలుగులను నింపగలదు. “తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉంటుంది” అనే ఖురాన్‌ సూక్తిని స్ఫురణకు తెచ్చిన డా. భవానీ దేవిగారి కృషి బహుధా ప్రశంసనీయం. వారికి హృదయపూర్వక శుభాభినందనలు.

- డా॥వెలువోలు నాగరాజ్యలక్ష్మి 9394113848


తెలుగు యువశాస్రవెత్త అభిలాష్‌ను కాపాడుకోలేకపోయాం!

ఆఖిలాష్‌ రంగారెడ్డి జిల్లా కోల్‌కుందే అనే పల్లెటూరులో పుట్టాడు. ఆర్థికస్తోమత లేని కుటుంబం వారిది. చదువులో చాలా చురుకైనవాడు. పల్లెటూరులో చదువుతున్నప్పుడే పంతుళ్ల ప్రశంసలు పొందాడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి తరగతిలోను ప్రథమశ్రేణిలో ప్రధముడుగా నిలిచాడు. ఇంటర్‌లో చదువుతున్నప్పుడే గణితంలో పన్నెండు (12) కొత్త సూత్రాలను కనిపెట్టాడు. సునాయాసంగా ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించుకో గలిగాడు. ఇంజనీరింగ్‌లో చదివే సమయంలోనే ఎక్కువ సమయం ప్రయోగశాలలో గడిపేవాడు. చదువు పూర్తవగానే ఆవిష్కరణలకు పూనుకున్నాడు. కొత్త రేసుకారు, మూడు రకాల విమానాల కొత్త నమూనాలను, ఎగిరే పళ్లెము, ఆర్బటాప్పర్‌ గ్లాడరు మొదలగువాటిని ఆవిష్కరించాడు. తన కొత్త ఆవిష్కరణలను బెంగుళూరు, చెన్నై ముంబయి, రాజధాని ఢిల్లీ కోల్‌కతా, గుహావటి నగరాలలో ప్రదర్శించాడు.

తెలుగువారి దురదృష్టం. 2010 ఫిబ్రవరిలోరోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో కోమాలోకి వెళ్లాడు. తల్లిదండ్రు లకు తగిన చికిత్స చేయించే స్తోమత లేదు. దాతల దానంతో వైద్యులు శక్తివంచన లేకుండ శ్రమించి వైద్య సేవలందిం చారు. దాతలిచ్చిన ధనం అయిపోయింది. చికిత్సకు డబ్బులేదు. విధిలేక తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. మన సర్కారు వారి దృష్టిలో నిరుపేద శాస్త్రవేత్త పడలేదు. వారికి కనపడలేదు. వినిపించలేదు. అదే ఏ రాజకీయ నేత అయితే అమెరికాలాంటి దేశాలకు పంపి వైద్యం చేయించేవారు. కాని ప్రభుత్వం పూనుకుని యువ శాస్త్రవేత్త అభిలాష్‌ను కాపాడుకోలేక పోయింది. పదిమాసాలు మృత్యువుతో అలుపెరుగని పోరాటంచేసి 2010 డిసెంబర్‌లో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు అభిలాష్‌. ప్రభుత్వం సిగ్గు పడవలసిన విషయం. ప్రజల తరపున మనం క్షమాపణ చెప్పుకుందాము.

- వేములపల్లి సత్యవతి