పుట:February 2020.అమ్మనుడి.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైజీరియాలోని రెండు భాషలు వచ్చు. మేం అతన్ని ఇంటర్వ్యూ చేసే సమయానికి టాంజానియా వెళ్ళడానికి సిద్ధమౌతున్నాడు. అక్కడ భాష మీరు నేర్చుకొనే వెళ్తున్నారా అని అడిగితే, నవ్వి “అక్కడ ఏ భాషో నాకు తెలియదు, ఎక్కడకు వెళ్ళినా 8 నెలల్లో ఆ ప్రాంతపు భాష నేర్చుకోగలను” అని థైర్యంగా చెప్పాడు. అతడు తన జీవితాన్ని గెలుచుకోవడానికి అతనికి ఉన్న ఎలక్ట్రికల్‌ నైపుణ్యం ఉపయోగపడిందే కాని ఇంగ్లీషు కాదు.

తమిళనాడు కార్ల డ్రైవర్ల హిందీ నైపుణ్యం :

తమిళనాడులోనీ పర్యాటక ప్రదేశాలలో కిరాయి కార్ల డ్రైవర్లు హిందీలో చక్కగా మాట్లాడటం గమనించాను.

తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగి హిందీని భాషగా స్మూళ్ళలో నుండి తరిమేసి చాలా కాలం అయ్యింది.

అయినా వారికి ఎలా అ భాష వచ్చింది అని అడిగితే “ఉత్తర భారతదేశ యాత్రికులతో సంభాషించాలి కదా అందుకని మాకు హిందీ వచ్చేస్తుంది” అని వారి సమాధానం. అవసరమే వారికి కొత్త భాషను నేర్పింది.

గడ్డం అనిత, గడ్గం జాషువా సునీల్‌ :

అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆయనతో ఎంతో చక్కగా సంభాషించిన “గడ్డం అనిత” అవనిగడ్డ మండలంలో ఒక కుగ్రామంలో పుట్టి హైస్కూల్‌ స్థాయి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నది.

ఐ.ఐ.టి. కాన్పూర్‌ లొ అద్భుతంగా రాణించిన “గడ్డం జాషువా సునీలొ” హైస్కూల్‌ చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. ఇటువంటి ఉదాహరణలు మనం వందలు - వేలు చెప్పుకోవచ్చు. పై యదార్ధ సంఘటనల వల్ల మన కర్ణమయ్యేదేమంటే? బలమైన అవసరం ఏర్పడితే, పట్టుదల, శ్రద్ద ఉంటే, ఎవరైనా, ఏ భాషనైనా మూడు నుండి ఆరు నెలల కాలంలో సునాయాసంగా నేర్చుకోగలరనే కదా! భాషను భాషగా నేర్చుకోవడమే సులభమని కూడ పై ఉదాహరణల వల్ల మనం గ్రహించవచ్చు.

మా ప్రచారంలో ఈ ఉదాహరణలన్నీ చెప్తూ తల్లిదండ్రులకు తమ పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించమని ప్రచారం చేస్తూండే వాళ్ళం. “ఇంగ్లీష్‌ భాషకు మేము వ్యతిరేకం కాదు” అని కూడా స్పష్టం చేస్తుండేవాళ్లం.

మానసిక వైద్య నిపుణులైన డా. పమిడి శ్రీనివాస్‌ తేజ రాసిన “మాతృ భాష - ప్రాథమిక విద్య” పుస్తకంలో పిల్లలు ప్రాథమిక విద్యను తమ 'సొంత భాష” లోనే ఎందుకు చదువుకోవాలో శాస్త్రీయంగా నిరూపించారు. పిల్లలలో మెదడు, మానసిక ఎదుగుదల, భాషలను నేర్చుకునే విధానం మొదలుకొని ఎన్నో విషయాలను ఎంతో వివరంగా చర్చించారు. ప్రపంచంలో జరిగిన అనేక అధ్యయనాలను వాటి ఫలితాలను ఆ పుస్తకం లో వివరించారు.

చుక్కా రామయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దినపత్రికలలో విద్య పైన వ్యాసాలు రాస్తుండేవారు. వారు 'ఇంటి భాష సిద్దాంతాన్ని ప్రచారం చేశారు. ప్రాథమిక విద్యను ఇంటి భాషలోనూ, ఉన్నత పాఠశాల విద్యను ప్రామాణిక తెలుగు భాషలోనూ బోధించాలని వారి వాదన. మాతృభాషలోనే పాఠశాల విద్యను బోధించాలని బలంగా వాదించే రామయ్య గారు కె.సి.ఆర్‌. గారు తాము గెలిస్తే తెలంగాణాలో కె.జి నుండి పి.జి. దాక ఇంగ్లీష్‌ మాధ్యమంలోనే బోధిస్తామని ప్రకటించినప్పుడు మాత్రం ఆ వాదనను ఖండించలేదు. రామయ్య గారూ! మీరు ఇలా మౌనంగా ఎందుకు ఉంటున్నారు? రాబోయే ప్రమాదాన్ని ఆపదానికి మీలాంటి వారు మాట్లాడకుంటే ఎలా? అని వారి వ్యాసాలు ప్రచురించే దినపత్రిక అన్నింటికీ ఉత్తరాలు రాశాను. కానీ ఏ పత్రికలోనూ ఈ ఉత్తరం ప్రచురించబడలేదు.

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యగారు ఆంగ్లంలో దిట్ట. ఆయన ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోలేదు. ఆసక్తితో ఇంగ్లీష్‌ ను అధ్యయనం చేసి అనేక పత్రికలలో వ్యాసాలు రాస్తున్నారు. ఇంగ్లీష్‌ లో అనేక పుస్తకాలు రాశారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని ఆయన తన వ్యాసాలలో రాస్తున్నారు. ముఖ్యంగా బహుజనులందరూ ఉన్నత స్థితికి చేరాలంటే ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.

ఐలయ్యగారి లాంటి మరికొంతమంది మేధావుల ప్రచారం వలన ఇంగ్లీషు మాత్రమే తమను ఉన్నత స్టితికి చేర్చే భాష అనే అఖిప్రాయం శ్రామిక వర్గంలో బలపడింది. ఇంగ్రీషు భాషను నేర్చుకోవడానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కానీ “మీడియం ద్వారా ఇంగ్లీషు నేర్చుకోవడం అశాస్త్రీయం”? అనే విషయం మరుగున పడిపోయింది.

70 వ దశకం నుండి ఉన్నత, మధ్య తరగతి వర్షాల ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించుకోవడం మొదలయింది. ఇంగ్లీషు పై ఉన్న వ్యామోహం, భాషను భాషగా నేర్చుకోవడానికీ - మీడియం ద్వారా భాష నేర్చుకోవడానికీ మధ్య ఉన్న వ్యత్యాసం తెలియకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో దిగజారుతున్న ప్రమాణాలు - ఇవన్నీ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలల దినదినాఖివృద్ధికి తోడ్పడ్డాయి.

ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడానికి ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ నిజాయితీ గా ప్రయత్నించలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళలో చదివించడం మొదలుపెట్టారు.

“జడి బాట " పేరుతో ప్రభుత్వ టీచర్లు వేసవి సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి తల్లితండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ప్రచారం చేసేవారు. అతి తక్కువ మంది టీచర్లు మాత్రమే తమ పిల్లలను తాము పనిచేసే స్కూళ్లల్లో చదివిస్తున్నారు. మరి టీచర్ల పిల్లలు ప్రైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళలో చదువుతుంటే వీరి మాటలకు విలువేంఉంటుంది? చివరకు నాణ్యమైన విద్య అంటే ఇంగ్లీషు మీడియం విద్యే అనే అభిప్రాయం ప్రజలలోకి వచ్చింది. ప్రభుత్వాలు కూడా అవే మాటలు మాట్లాడుతున్నాయి. ఇక సినిమాల సంగతికొస్తే - తెలుగు మీడియంలో చదువుకున్న పాత్రలు ఆత్మన్యూనతతో ఉన్నట్లు, వాళ్లను హేళన చేస్తున్నట్లు చూపించడం జరుగుతోంది.

APTF మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలేవీ “మాతృభాష లోనే ప్రాథమిక విద్య” జరగాలనే ప్రచారం గట్టిగా చేయలేదు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020

17