పుట:February 2020.అమ్మనుడి.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాల సుబ్రహ్మణ్యం గారి సభ తరువాత కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం నుండి తెలుగు మీడియంలోనికి మార్చారు కూడా. కానీ ఆ తరువాత వచ్చిన ఐ.టి.బూమ్‌, తద్ద్వారా వచ్చే కొద్దిపాటి అమెరికా ఉద్యోగాలు తల్లితండ్రులు, తమ విల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో మాత్రమే చదివించే పరిస్థితికి బలంగా నెట్టాయి. అమెరికాలో ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్‌ బాగా రావాలని, ఇంగ్లీష్‌ బాగా రావాలంటే ఇంగ్లీష్‌ మీడియంలోనే చదవాలని తల్లితండ్రుల అపోహ! మీడియం ద్వారా కొత్త భాషను నేర్పించడం అనే ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, భాషను భాష గానే నేర్పించాలని ఇంగ్లీష్‌ భాషను 3 వ తరగతిలో ప్రవేశపెట్టి పరభాష నేర్పే పద్దతిలో నేర్పిస్తే 10 వ తరగతి సమయానికి మంచి ఇంగ్లీష్‌ నేర్పించవచ్చని చెబుతుండేవాళ్ళం. నేను, దా. పద్మావతి, వేంకటేశ్వరరావు, రామారావు, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, వాసుదేవరావు మాస్టార్లు మరి కొంత మందితో కలిసి ప్రతి పల్లెలో తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించాం. అమెరికాలో ఉద్యోగాలు అతి తక్కువని ఆ ఉద్యోగాల కోసం వెళ్ళే వారి కోసం ఇంగ్లీష్‌ నేర్పడం పెద్ద కష్టమైన పని కాదని చెప్పుండేవాళ్ళం.

మా పిల్లలు 10 వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివారు. మా అబ్బాయికి ఎంసెట్‌ లో తొలిసారే 2001లో ౩వ ర్యాంకుతో MBBS సీటు వచ్చినప్పుడు కొంతమంది ప్రత్యేకంగా నన్ను కలసి “మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించారు, మీ అభిప్రాయం సరైనదేనని బుజువైంది " అని చెప్పారు. కానీ మా అబ్బాయికి సీటు రాకపోయినా నా అభిప్రాయం సరైనదే. మా ఆమ్మాయి కూడా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా దుబాయి లో పనిచేస్తోంది.

ఆమె తన వృత్తిలో పూర్తిగా ఆంగ్ల భాషలోనే వ్యవహరించాలి వస్తుంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడానికి, తోటివారితో వ్యవహరించడానికి, రాత పూర్వకమైన వృత్తి పనులకు ఎప్పుడూ తను తెలుగు మీడియంలో చదవడం వలన ఇబ్బంది పడలేదు. ఇప్పుడు మా మనవళ్లు కూడా తెలుగు మీడియంలోనే చదువుతున్నారు.

మిత్రుల అనుభవాలు :

మా మిత్రులలో చాలామంది తమ పిల్లలను తెలుగు మీడియం లోనే చదివించారు. నా మిత్రుడు డాక్టర్‌ సాంబిరెడ్డి తెనాలిలో వాళ్ల పిల్లలను చేర్పించడానికి ఒక తెలుగు మీడియం స్ఫూల్‌కి వెళితే “ఈ స్కూల్‌ మీలాంటి పెద్ద వాళ్ల కోసం కాదు. మాది కేవలం తెలుగు మీడియం స్మూలు” అని ఆ హెడ్‌ మాష్టారు చెప్పారు. “నేను కావాలనే తెలుగు మీడియం స్కూల్‌ లో చేర్చించడం కోసం వచ్చాను” అని వాళ్ళను ఒప్పించి ఆ స్కూల్‌ లోనే చేర్చారు. ఆ పిల్లలిద్దరకు జీవితంలో స్థిర పడటానికి తెలుగు మీడియం వలన ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు సరికదా వాళ్ళు తమ బాల్యాన్ని ఆనందిస్తూ చదువుకున్నారు. ఇంగ్లీషులో మాట్లాడగలగడం, వ్యవహరించగలగడంలో వారికి ఏ సమస్య లేదు. ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు చక్కగా వారి వృత్తులలో స్థిరపడ్డారు.

చల్లపల్లిలోని నాగేశ్వరరావు మాష్టారి పిల్లలిద్దరూ 10 వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకుని మొదటిసారే MBBS సీటు తెచ్చుకుని ఇప్పుడు ఒకరు కార్జియాలజిస్ట్‌గానూ,

| ఇంకొకరు ఎండోకైనాలజిస్ట్‌ గానూ పనిచేస్తున్నారు. కోటేశ్వరరావు మాష్టారి పిల్లలిద్దరూ కూడా 10 వ తరగతి వరకు తెలుగు మీడియం లోనే చదువుకుని సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. వేంకటేశ్వరరావు మాష్టారి కుమారుడు కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. తమ పిలల్లను తెలుగు మీడియంలో చదివించిన మా మిత్రులు, వారి పిల్లలు ఉన్నత స్థితికి చేరి, సంతోషంగానే ఉన్నారు. ఇంగ్లీష్‌ భాషలో సాధికారత సంపాదించుకోవడంలో వారికి తెలుగు మీడియం ఏమీ అడ్డంరాలేదు. పైగా ఉపాధికోసం కావలసిన సబ్జెక్టు అలో అవగాహన మెరుగ్గా ఉండడం వారికి మరింత ఉపయోగపడింది.

ప్రఖ్యాత ఆంగ్ల రచయిత - లంకా శివరామప్రసాదు నేటి ప్రఖ్యాత ఆంగ్ల రచయిత అయిన లంకా శివరామప్రసాదు వైద్యవిద్యలో నా సహచరుడు. అనేక ఇంగ్లీష్‌ క్లాసిక్‌ పుస్తకాలను తెలుగులోనికి అనువదించాడు. భగవద్గీత ను పద్యాలుగా ఇంగ్లీష్‌లో రాయడమే కాకుండా అనేక తెలుగు పుస్తకాలను ఇంగ్లీష్‌ లోకి అనువదించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంత గొప్ప అంగ్ల కవి హైస్కూల్‌ విద్య వరకు తెలుగు మీడియంలోనే చదివాడు.

మరికొన్ని అనుభవాలు :

కొద్ది సంవత్సరాల క్రితం డా. రజనీకాంత్‌ అరోలీ అనే “రామన్‌ మెగసెసే” అవార్డు గ్రహీత (మహార్యాష్టలోనీ లాతూర్‌ ప్రాంతంలోని 300 గ్రామాల ప్రజలలో కల్గించిన ఆరోగ్య అవగాహనకై యీాయనకా బహుమతి వచ్చింది) పాల్టొన్నారు. ఆయనతో బాటు అదే సంస్థలో "కృత్రిమ అవయవాల తయారీ " విభాగంలో పనిచేసే ఒక వ్యక్తి కూడ వస్తే నేనాతనని కలిశాను. ఆయన తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందినవాడు. తెలుగు మీడియంలో నాలుగో తరగతి చదువుతూ, ఇంటి నుండి పారిపోయి, బొంబాయి చేరి, కొన్నాళ్ళ తరువాత డాక్టరు అరోలి దగ్గర పనికి చేరాడు. తక్కువ ఖర్చుతో కృత్రిమ అవయవాలు తయారు చేయాలనుకున్న ఆ సంస్థ అతణ్జి జైపూర్‌ పంపి శిక్షణ ఇప్పించింది. ఈయన కెన్యా, టాంజానియా వంటి విదేశాలలో కృత్రిమ అవయవాల తయారీ పాఠాలు బోధించేవారు.

“మీరు వాళ్ళకి పాఠాలు ఏ భాషలో బోధిస్తున్నారు?” అని ప్రశ్నించాను.

“ఇంగ్లీష్‌ లో” అని ఆయన సమాధానం.

“మీరు చదివిందేమో 4 వ తరగతి. అదీ ఒక మారుమూల పల్లెలో, తెలుగు మీడియం స్కూల్లో గదా! విదేశాల వారి కర్దమయ్యేలా ఆంగ్లంలో ఉవన్వాసాలెలా ఇవ్వగలుగుతున్నారు? ఇంగ్లీష్‌ను ప్రత్యేకంగా ఎన్నేళ్లు కష్టపడి నేర్చుకున్నారు?” అని మళ్ళీ అడిగాను.

“లేదు - నేను ప్రత్వేకంగా ఆ భాషను నేర్చుకోనేలేదు. మా సంస్థను చూడటానికి, శిక్షణ పొందటానికీ చాల మంది విదేశీయులు జొంబాయి వస్తుంటారు. వారి ఆంగ్ల సంభాషణలు వింటూ, తోటివారితో ఆంగ్లంలో సంభాషిస్తూ క్రమక్రమంగా ఆంగ్లం మాట్లాడటం నేర్చుకొన్నాను. విదేశీయులిక్కడికి వచ్చినా, నేను విదేశాలకు పోయినా ఆ భాషలోనే మాట్లాడి తీరవలసి అవసరం వచ్చింది కనుక నానాటికీ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020

15