పుట:Ecchini-Kumari1919.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఇచ్చినీ కుమారి


అభయసింగందుల కానందించి రూపవతీ ! నీవంటి బుద్ధిమంతురాలును, నుచితజ్ఞురాలును వేడొకతి యుండదు. నీచిత్ర లేఖనా చాతుర్యముగూడ మిగులఁ గొనియాడదగినది. కన్యాంతఃపురమున నీకున్న చనవు మఱి యెవ్వరికిని లేదు. రాజపుత్రిగూడ నిన్ను బహిఃప్రాణముగాఁ జూచుకొనును. ఇంతస్వల్ప కాలములో నే రాజకులమునందు నీ వింత గౌరవ మార్జించుటకు నీగుణసంపత్తి యే కాక వేఱు కారణ మేమి కలదు?

రూ-అయ్యా!నే నంత పొగడఁదగిన దానను గాను. ఇక నాప్రసంగము విడిచి మీరు వచ్చినపని యేమో తెలియఁ జెప్పుఁడు.

అభ: యువతీ ! ఏమియును లేదు. మీయంతఃపుర మునఁగల విశేషములను దెలిసికొనవచ్చితిని,

రూ: రాజపుత్రా! చెప్పఁదగినవి శేషము లేమియును లేవు,

అభ- సుందరీ ! నీవు మిగుల మంచిదానవు. కార్యమును నెఱ వేర్పఁదగిస శక్తి నీకుఁ దప్ప మఱియెవ్వరికిని లేదు. నాకు రెండవ హృదయమువంటిదాన వగునీకు నారహ స్యములు వెల్లడించిన నేమి చిక్కులు సంభవించును ? కావున, నామనస్సునఁ గలదంతయు వెడలఁబోసెదను వినుము. 'నేను జై తపరమారుని మేనల్లుఁడ ననువిషయము నీకుఁ డెలియునా ?