పుట:Ecchini-Kumari1919.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఇచ్చి నీ కు మా రి


అమ- దేవర యజ్ఞ చొప్పున నట్లే పోయెదను.

భీమ-నీవు పరమారుని దర్శించి మొదట సామము తోనే మాటాడుము. నే నతనికుమారిని గోరుచున్నా నని చెప్పుము, తరువాత నాసంబంధమునందుఁగల గొప్పతనమును వర్ణింపుము. అంగీకరించినసరియే ! లేకున్న , రెండు నిముసముల లో నే యాబూగడము నామావ శేషమగు నని చెప్పుము.

అమ— రాజేంద్రా ! అట్లే చేసెదను. తమరు నాకు మాటలు నేర్పవ లెనా ! ఈ కార్య మెట్లయిన సాధింపఁగలనను నమ్మకము నా కున్నది.

అనిచెప్పి యారాజు సెలవు గైకొని యప్పుడే యాబూగడమునకుఁ బోయెను.

ఆ ఱవ ప్రకరణ ము

అభయ సింగు

ఆబూగడమున నభయసింగనెడి రాజకుమారుఁ డొకఁ డుండెను. అతఁడు జై తపరమారుని చెల్లెలికొడుకు. అతఁడు చిన్నప్పటినుండియు నాబూగడమున నే పెరిఁగెను. పరమారుఁడు తన సోదరియందలి ప్రేమాతిశయములను బురస్కరించుకొని యభయసింగు నెక్కువగా నాదరించి తన పుతీ పుత్రులతో సమానముగా నభివర్ధించెను. అభయసింగును మేనమామ యందు మిగుల భయభక్తులు గలవాఁడై మెలఁగుచుండెను.