పుట:Ecchini-Kumari1919.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకర ణ ము :5

27



అమ: - దేవా ! ఈస్వల్ప కార్యమునకుఁ దమ రింత

           విచారింప నేల ? ఆయునతికిఁ దమయందనురాగము
           గల్గింపనొక తె నిదినఱకే ఫుచ్చియుంటిమిక దా ! ఆమె యాయిచ్ఛిని
           మ్రోలఁ దమగుణములను వర్ణించి తదీయమానసమును మీ
          యం దీపాటి కే లగ్నముగావించి యుండును. ఈయభిప్రాయ
          మును బరమారునకుఁ దెలిసినచో నధికానందభరితుఁడై తమ
          కిచ్చి పెండ్లి చేయును. పరమారునకుఁ దమవంటివాఁ డల్లుఁ
          డగుట మహాభాగ్యము గదా !

భీమ: - నీ వన్న దానియందుఁ జాలనఱకు సత్య

            మున్నది. కాని, యారాజు జై నమతమును ద్వేషించును .
            జైనమతావలంబి నగునాకా కన్యక నతఁడు సంతోష పూర్వ
            కముగా నెప్పటికి నీయఁడు.

అమ: - దేవా ! తమరి ట్లమాయికముగా మాటా

             డెద రేల ! మీ పేరు విని గడగడలాడని రాజవీరుఁ . డీయుత్తర
             హిందూస్థానమున నెవఁ డున్నాఁడు ? తమకోర్కి, నేరాజు
             విఫలముగాఁ జేయఁజూలును ? ఒక వేళ నీపరమారుఁ డట్టి
             సాహసమునకే పూనికొనినచో దండోపాయము చేత నే
             కార్యము' సాధించుకొనవచ్చును.

భీమ. ముందుగా జై తపరమారుని యభిప్రాయ

          మెఱిగి వచ్చుట మనకుఁ గర్త వ్యముకాదా ?

అమ: - అవును, దేవర సెలవిచ్చినది సత్యమే !

భీమ- అట్లయిన నీవె యాబూదుర్గమునకుఁ బోయి

          రావలయును,