పుట:Ecchini-Kumari1919.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 4

19



డా దేశము నేలుచుండినట్లు చరిత్ర వలనఁ దెలియ వచ్చుచున్నది . ఆరాజు మిగుల శూరుఁడు, విద్వాంసుఁడు, రాజనీతియం దాఱి తేటిన వాఁడు. పంచాసర మనుపట్టణ మతనికి రాజధాని. అతని భార్య రూపసుందరి. అతని బానమఱఁది శూర పాలుఁ డును మహాశూరుఁడు. ఆతఁడు మహానై భవముతో ఘూర్జర మును బాలించుచుండ నాకాలమున కలియాపురమును బా లించువాఁడును, చాళుక్యవంశ సంభవుఁడును నగుభూవర రాజు జయ శేఖరునికీ ర్తి విని యతని జయింపఁదలంపుతో సై న్యము లను జేర్చుకొని గుజ రాతు పై దాడి వెడ లెను. జయ శేఖరుఁ డది విని సుంతేనియు ' జంకక' శూర పాలునికిఁ గొంత సైన్య మిచ్చి భూవరుని నెదిరింపఁ బంపెను. ఆ రెండు సైన్యములు నాబూ పర్వతము యొద్దఁ గలసికొ నెను. ఘోరయుద్ధము జరి ఆ యుద్ధమున శూరపాలుఁడే జయమందెను. భూవరుఁడు పరాభూతుఁడై తన పురమునకు మరలిపోయెను. రెండువత్సరములు గడచిన పిమ్మట భూవరుఁడు వెను కటి పరాభవమును దీర్చుకొన నెంచి మహా సై న్యముతో వెడలి జయ శేఖరుని రాజధాని యగుపంచాసరమును ముట్ట డిం చెను. మహాసముద్రమువంటి శత్రు సై న్యమును జూచి జయము గల్గుట దుర్లభ మని నిశ్చయించి గర్భవతి యగుతన భార్యను శూర పాలుని కప్పగించి పురము "వెడలిపొమ్మని యాజ్ఞాపించి జయ శేఖరుఁడు శత్రువులతో వీరస్వర్గముఁ గాం చెను. అతని రాజ్యము భూవరునికి వశమయ్యెను.