పుట:Ecchini-Kumari1919.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఇచ్చనీ కు మారి


గట్టిగాఁ దన్నెను. పిడుగు దెబ్బవంటి యాతన్నుఁ దిని యా దాసి దూరముగాఁ దూలిపడెను. ఆ తాపువలన గుండె బరు వెక్కి బాధించుచున్నను నది యెట్లో సహించి లేనినగవుఁ దెచ్చికొని మెల్లగా లేచి భీమునిఁ జూచి 'అయ్యా ! ఈ యువతిని మీరే వశపఱచి కొనుఁడు. నే నీమె చెంత మాటాడ లేను. మాటాడిన నీమె యూరకుండదు. ఈ తాపున కే నా గుండె కందిపోయి మిక్కిలి బాధించుచున్నది. ఇంకను నీమెకు హితోపదేశము చేసిన నాప్రాణములు దక్కవు' అని పలికెను, భీముఁ డందులకు నవ్వుచు నిచ్ఛినీకుమారికి వినఁబడునట్లు 'రూపవతీ ! నీ పల్కు లసందర్భములు. పూలబంతితోఁ గొట్టిన శరీరము కందునా ! నొప్పి చెందునా ! పూలబంతికంటె నతి మృదువగు నీ మెపాదతల మెక్కడ ? అది తాకినంతమాత్ర మున నీకు నొప్పి జనించు టెక్కడ ? వట్టిమాట ! అట్టి మృదు పద తాడనము లభించినందులకు నీ వెంతయో యానందింప వలసియుండఁగా విచారింతు వేల ? ఆపాదఘాతము నాగుండె యం దే తగిలిన ' నే నపరిమి తానందమును జెందుదును. కృతా ర్థుఁడ నగుదును. కాని, నా కట్టి భాగ్యము లభింప లేదు.నీ వెంత భాగ్యవంతురాలవు !' అని పల్కుచుండ రూపవతి విని 'అయ్యా ! నాభాగ్యము మండిన జేయున్నది. మోహాంధు లై యున్న మీ కీమె పాదతలము పుష్పముకంటె నెక్కుడు మృదువుగా నున్నట్టు తోఁపవచ్చును. కాని, నా కిది వజ్రము కంటెను గొంచెము గట్టిగా నున్నట్లే యున్నది. ఈమె పాద