పుట:Dvipada-Bagavathamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

మధురకాండము

పిడికిళ్ళ నొప్పింపఁ భిరికి ప్రాణములు
యొడలికిఁబెడఁబాయ నొప్పార కంసు
ఘనకళేబరము రంగము వాయనీడ్చి
యనుపమధ్వనిఁ బేర్చి యార్చి మురారి
యతనితమ్ములు సునాభక్రోధనాథు
లతిసత్వు లెనమండ్ర మలపాణి చంపె;
నప్పుడు పౌరులయార్పులు నింగి
నుప్పొంగి బహుపాశకోక్తులఁ జెలంగె.

కంసుని మరణముఁ గని దేవతలు హర్షించుట


భవకమలాసనప్రముఖదేవతలు
ప్రవిమలంబుగఁ బ్రణుతించి రెలమి
దివిబీఁటకొని మ్రోసె దేవధుందుభులు
దివిజకామినులు నర్తించి రింపార;240
పొరిఁబొరి మందారపుష్పవర్షములు
సురకోటి దేవకీసుతుమీఁదఁ గురిసి
రంతట, కంసుండు హతుడౌట యెఱిఁగి
యంతఃపురాంగన లడలు దీపింప
నడుగులు తడబడ నాత్మలు కలఁగ
సుడివడి లోగుంది సృక్కి బల్వడిని,
నురముల శిరముల నొరి మ్రోదుకొనుచు
పరిపరివిధముల పలవించి మిగుల
నార్తనాదంబుల నందంద బొగిలి

కంసునిస్త్రీలు తమపతి మరణమునకు విలపించుట


భర్తపై వ్రాలుచు బహుభంగి నొగిలి
హా! యని యేడ్చుచు హా నాథ! యనుచు