పుట:Dvipada-Bagavathamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ద్విపదభాగవతము

పోయితే! మము బాసి భోజవంశాఢ్య!
కటకటా! శోకానఁ గ్రాలంగ మమ్ము
నిటఁ జూడ వించుక యేలఁ గైకొనవు?
ఇనుఁడు నీమీఁదట యెండరానోడు;
ననిలుండు నీమీఁద నటవీవ వెఱచు;
ననలుండు తీవ్రార్చు లడరింపనోడు;
ననిమిషాదులు మీకు నడకుదు రెపుడు;
నీయాజ్ఞ నీలావు నీరాజసంబు
నీయొప్పు నీనేర్పు నీమంచితనము250
వ్రేయవారలచేత వేల్మిడినడఁగి
మాయమైపోయితే మనుజదేవేంద్ర!"
అని బహుభంగుల నార్తులై పొగుల
వనితల నూరార్చి వాసుదేవుండు

శ్రీకృష్ణుఁడు కారాగృహమునుండి దేవకీవసుదేవులను విడిపించుట


కారాగృహంబునఁ గడునొచ్చియున్న
వీరుని వసుదేవు, వెలఁది దేవకిని,
గని వారికాలి సంకిలియలూడ్పించి
వినయంబుతో మ్రొక్క వెఱఁగంది వారు
గోవిందహలులఁ గల్గొని తమపాలి
దైవంబులని, యాత్మఁదలఁచిరి గాని
తనయభావంబుగాఁ దలఁచకయున్న
తనమాయ హరి మోహతమముఁ గారించ
చన్నులఁ బాలును సమ్మదాశ్రువులు
కన్నులఁ దొరల నక్కాంతాలలామ