పుట:Dvipada-Bagavathamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ద్విపదభాగవతము

శ్రీకృష్ణుఁడు హేళనగాఁ జణూరనకు బదులు చెప్పుట


"పల్లవులము పిన్నపాపలు మేము
తగిన జెట్లును మీరు ధరణీశునొద్ద
జగతిపైఁ బోరుల సడిసన్నవారు180
మీతోడ రణవీథి మెఱసి సేయంగ
నాతరంబులవార మగుదుమే మేము?
చెనసి భూపతి వేడ్కఁ జెడకుండ కొంత
పెనఁగెద”మని పల్కి ప్రీతి మై పెంచి

శ్రీకృష్ణుఁడు చాణూరునితో మల్లయుద్ధముఁ జేయుట


వడిమల్ల చఱచి భూవలయంబు పగుల
బెడిదంబుగా నార్చి పిడికిళ్లు చాఁచి
వానిమై కదియు ముష్టాముష్టి గవియఁ
జూణూరుఁడును మల్ల చఱచి యిట్లొరసి
యిరువురు భుజ మప్పళించు చప్పుళ్లు
శరనిధి కలఁగె నాశాచక్ర మగిలె
నంతకుఁ దెసఁజేరి యవనిపరాగ,
మింతింతఁగొన మేన నిరవారఁజల్లి
కొనిపదఘాతల కూర్మంబు వగులఁ
దనరు మహాభద్రదంతుల రీతిఁ
జేతికి నొడిసినఁ జేయీక తివిసి
ఘాతసేయంగ దగ్గఱి మేను దొలఁగి
పొడిచిన నది వెలిపుచ్చి మైవంచి
యొడిసి తొడలఁ దట్టి యార్చి పెల్లురికి