పుట:Dvipada-Bagavathamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

17

నవయలంబులుగల యద్రులో యనఁగ
[1]పవివ్రేయ నాపెడు బలుదిట్ట లనఁగ
ముష్టికచాణూరముఖ్యులు నృపతి
యిష్టంబుఁ గని రంగమెల్లఁ దారగుచుఁ170
గినుకమై బలరామకృష్ణులఁ జేరఁ
జని మహాధ్వని మల్ల చఱచి యిట్లనిరి.

ముష్టికచాణూరులు బలరామకృష్ణుల నధిక్షేపించుట


“వసుదేవసుతులార! వసుధలో మిమ్ము
లసమానసత్వాఢ్యు లం డ్రెల్లవారు
పెక్కండ్రదనుజుల పీచంబు లణఁచి
యక్కజంబుగ మెఱసినయట్టిసాహసులు;
భోజభూవిభుఁడు మీపోరు నీక్షించి
రాజిల్ల మమ్మిట రప్పించినాఁడు;
మందలోపల గొల్లమగనాండ్లఁ దిరిగి
సందింపుచును నాడ సానురాగములఁ
బిల్లగ్రోలూఁదుచుఁ బెరయుటగాడు
మల్లయుద్ధములకు మమ్ము డగ్గరుట;
యేను చాణూరుండ యితఁడు ముష్టికుఁడు
పూని నీపును నేను బోరుద మెలమి
ముష్టికుతోడ రాముఁడు మల్లయుద్ధ
మిష్టలీలల నొప్పు డిది సాటి" యనుఁడు,
అల్లన నవ్వుచు నంబుజోదరుఁడు

  1. పవి వ్రెయ్యవాపిన బలుచాగలనంగ