పుట:Dvipada-Bagavathamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

ద్విపదభాగవతము

ఘనకపోతమునకై కండలు గోసి
తనువిచ్చి శిబి ధాత్రి ధన్యుఁడు గాఁడె!
మును హరిశ్చంద్రుండు మొగి కౌశికునకుఁ
దనరార పుత్రునిఁ దగ విక్రయించి
చండాలరూపమై శౌర్యంబుఁ గ్రాఁగి
యుండి తాఁబొందఁడే యూర్ధ్వలోకంబు!540
ఒక కపోతము తొల్లి యొక కిరాతునకుఁ
బ్రకటమై తనమేను భక్ష్యంబుఁ జేసి
యెట్టిపుణ్యులకైన నెన్నఁగరాని
యట్టిలోకము గాంచె నని చెప్ప వినమె!
పడుచును కనకంబుఁ బ్రాయంబు నమ్మి
యడిగిన లేదని యర్థి వర్గంబు
నెడపిన పాపాత్ము లిందును నందుఁ
జెడిపోవుదు”రనుచుఁ జెప్పిన నతఁడు
వారి తేజంబులు వారి సత్వములు
వారి మేనుల రణవ్రణకిణంబులును
గని మహీనాథులుగా నిశ్చయించి
యనియె వారలతోడ నల్లన నగుచు.
“భూపాలకులు మీకుఁ బురుడేది! విప్ర
రూపంబులొంది మా ప్రోలికి వచ్చి
యడుగుచున్నారు మీరథితులుగారు!
అడుగుఁడు ప్రాణంబులైన మీకిత్తు!
విప్రవేషముఁదాల్చి వేఁడుట చేత
విప్రోత్తముఁడు స్వయం విష్ణుఁడ వీవ”
యని పలుకఁగ శౌరి యతని తెంపునకు