పుట:Dvipada-Bagavathamu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

ద్విపదభాగవతము

జెనకి యెవ్వనికి నిర్జింపఁగా నరిది
యనిలజార్జునులతో నాపురికేఁగి
చని విప్రవరులయాచందమై వేడి
మల్లయుద్ధంబున మరి భీముచేత
నెల్లభంగులవాని యేపడగింపు
మాతఁడు దీరిన నఖిలరాజులకుఁ
“బ్రీతియౌ పగదీరుఁ బెంపొందు నీకుఁ
దగ జరాసంధుచేతను బద్ధులైన
జగతీశ్వరులఁ బ్రోవఁ జనుటయే లెస్స.”

శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థ ప్రయాణము


అని యుద్ధవుండిటు లాడువాక్యములు
విని సంతసమునొంది వెన్నుఁడాప్రొద్దె
యానకదుందుభి హలపాణి యుగ్ర
సేనాదులనుమతి సేయంగఁ గదలి
భూతలాధీశులు పుత్తెంచినట్టి
దూతకభీష్ట వస్తువులిచ్చి యనిపి
పటు సైన్య మేఘ పుష్పక బలాకాది
చటులవాజులఁ బూని సన్నద్ధలీల480
గరుడకేతనకాంతిఁ గడునొప్పు తేరు
గురుతరంబుగ దారకుఁడు దెచ్చి మ్రొక్క
నారోహణము సేసి యఖిలబాంధవులుఁ
దోరంపు వేడుకతోఁ గొల్చి రాఁగఁ;
జెలువారు కాంచన శిబిరంబు లెక్కి
యెలమి పట్టపుదేవు లెనమండ్రు నడువ;