పుట:Dvipada-Bagavathamu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

199

[1]వలనొప్ప పటహాదివాద్యంబు లొలయ
వందిబృందములు కైవారంబు సేయ
సందడి పడవాళ్లు జడిసి తోనడువ
నతివైభవముల నిత్యప్రయాణముల
జతురతఁ బెక్కు దేశములుత్తరించి
జలజాతనేత్రుఁడు సకలసంపదలఁ
బొలుచునింద్రప్రస్థపురము కేతెంచె.

ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట


అమ్మహాత్మునిరాక యరసి ధర్మజుఁడు
తమ్ములుఁ దాను బాంధవులతో నెదురు,
వచ్చి నమ్రుండైన వసుదేవతనయు
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చె; గోవిందు డంత
ననిలనందను బ్రేమ నక్కునఁ జేర్చి
తనకు మ్రొక్కిన మాద్రి తనయుల నరుని490
[2]ననువార నాలింగనము సేసి వార
లందఱుఁ గొల్చిరా నమరేంద్రులీలఁ
జెంది యప్పురిఁ ప్రవేశించె మురారి.
పౌరుల కన్నులపండువ గాఁగ
భూరిపుణ్యుఁడు పాండవుల నగరికిని
నరిగి కుంతికి మ్రొక్క నమ్మహాదేవి
కరమొప్పఁ గృష్ణుని గౌఁగిటఁ జేర్చి
యానందరసముబ్బి యలుగులుఁ బారఁ

  1. ఒకే పాదమున్నది
  2. ఒకే పాదమున్నది