పుట:Dvipada-Bagavathamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

ద్విపదభాగవతము

నల్లన నవ్వుచు నఖిలబాంధవులఁ
జల్లని చూపుల శౌరి వీక్షింపఁ
దేరాయతము సేసి తెచ్చి మ్రొక్కుటయు
దారకుఁగని నవ్వి తగ రథంబెక్కి
పసిఁడిబద్దలబూనిఁ పడవాళ్లు మ్రోయ
నెసఁగ సందడి జడియించి తోనడువ
నగరి సుధర్మాఖ్య యగు సభాస్ధలిని
కరమొప్పు ముత్యాల గద్దియ మీఁద
వీరాసనస్థుఁడై విష్ణుఁ డొప్పారె.
చేరి రసజ్ఞులు సేవకోత్తములు430
నగణిత నీతివిద్యావిశారదులు
దగుమంత్రి సామంత దండనాయకులు
నల్లుఁడు కొడుకులు నఖిలబాంధవులు
నెల్లసంపదలతో నేపారి కొలువ
అందంద కరకంకణారావ మెలయ
చందనగంధులు చామరల్ వీవఁ
గొలువెల్లఁ దామరకొలను చందమున
నలరి సేవింపఁగ నధికమోదమున
నగ్రజుఁడును దాను యమ్మురారాతి
యుగ్రసేనునిఁ గొల్చియున్న యావేళ
దౌవారికులచేతఁ దగఁజెప్పి పనిచి
యావాసుదేవుని యనుమతిఁ బడసి
చనుదెంచె నొక్కఁ డాజలజాత నేత్రుఁ
గని మ్రొక్కి పలికె నక్కటికంబుఁదోఁప.