పుట:Dvipada-Bagavathamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

195

రాజులచేఁ బంపఁబడిన దూత శ్రీకృష్ణుని యెదుట మొరవెట్టుట


“జగతి భారము మాన్ప శత్రుల నడప
నగణితంబగు సాదులగు వారిఁగావ
యాదవాన్వయమున నవతారమొంది
తాదినారాయణ! అమరేంద్రవంద్య!
మగధభూపాలుఁడు మది నోట లేక
జగతీశ్వరులనెల్లఁ జంపుచున్నాఁడు!440
వెఱవేది యిరువుర వేవుర నృపులఁ
జెఱఁబెట్టి మదిఁ గృపచింత వోవిడిచి
తరమిడి దినమొక్క ధరణీశవరునిఁ
బొరివుచ్చి భైరవపూజఁగావించు.
అతనికి లోఁబడ్డ యవనీశులెందుఁ
గతిలేక యున్న మీకడకుఁ బుత్తేర
నరుదెంచినాఁడ నీవాజరాసంధుఁ
బరిమార్చి నృపకోటి ప్రాణంబు లెత్తు
మేవిధంబున నైన నీబారిఁ గడవ
నీవెకాకొక్కండు నేర్చునే కృష్ణ?
ఇది నీకు విక్రమింబిది నీకుఁ బెంపు!
ఇది నీకు శౌర్యంబు యిందిరాధీశ!
కీర్తియు సుకృతంబు గెలుపు నీకబ్బు!
ఆర్తుల రక్షింపు మంభోజనయన!”

నారదుని యాగమనము


అని దూత వినుతింప నంత నారదుఁడు