పుట:DivyaDesaPrakasika.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. మణిమాడక్కోయిల్ 30 (తిరునాంగూర్)

(శీర్గాళి - వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ)

శ్లో. భాభాతి దివ్య మణిమాడ పురే సురేంద్ర
   రుద్రాభిధాన నళినీ ద్వయ శీభమానే|
   శ్రీపుండరీక లతికా మహిషీ సమేతో
   నన్దా ప్రదీప భగవానితి నామధేయ:||

శ్లో. ప్రాచీముఖాసనలసన్ ప్రణవాభిధాన
   వైమాన వాస రసిక శ్శ్రిత పారిజాత:|
   ఏకాదశేశ మఘవన్నయనాను భూత
   శ్రీమత్కలిఘ్న మునిపుజ్గవ కీర్తిత శ్రీ:||

వివ: నందా విళక్కు పెరుమాళ్(నరనారాయణర్)-పుండరీక వల్లి తాయార్-ఇంద్ర పుష్కరిణీ-రుద్రపుష్కరిణి(ప్రణవాకార విమానము)-తూర్పు ముఖము-కూర్చున్న సేవ-ఏకాదశరుద్రులకు, ఇంద్రునకు(మాతంగ మహర్షికి)ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: మకరమాసము అమావాస్య(తై అమావాస్య) నాడు జరుగు 12 గరుడ సేవలను సేవించియే తీరవలెను. తిరునాంగూర్ తిరుపతులలో నిదిమొదటిది. మిగిలినవి వై గున్ద విణ్ణగరం. అరిమేయ విణ్ణగరం, వణ్ పురుషోత్తమం, శెంబొన్‌శెయ్ కోయిల్; తిరుతైట్రి యంబలమ్‌, ఈ సన్నిధిలో తిరుక్కోట్టియూర్ నంబి(గోష్ఠీపూర్ణులు) వేంచేసియున్నారు. అర్చకస్వాములను ముందుగా కలసికొని సేవింపవలెను. మేషం చిత్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. శీర్గాళి నుండి టౌన్ బస్ కలదు. రామానుజ కూటం గలదు. మిగతా భోజనాది విషయాలు సన్నిధిలో ఏర్పాటు చేసికోవాలి.

ప్రతి సంవత్సరము మకర మాసము అమావాస్య దినమున తిరుమంగై ఆళ్వార్లు తిరువాలి తిరునగరి నుండి పల్లకిలో వేంచేసి, తిరుక్కురైయలూర్ క్షేత్రమును చేరి అచట వేంచేసియున్న పంచ నృసింహమూర్తులకు "వాడినేన్‌వాడి", పాశురాలతో మంగళా శాసనం చేయుదురు. పిమ్మట మంగై మఠం చేరి "అజ్గణ్ జ్ఞాలం" అను పాశురములతో ఉత్తరదేశమున వేంచేసియున్న "శిజ్గవేళ్‌కున్ఱమ్"(అహోబిలం) పెరుమాళ్లకు మంగళ శాసనం చేయుదురు.

అటు పిమ్మట తిరుక్కావళంబాడి, తిరుమణిక్కూడం; తిరుపార్తం పళ్లి మొదలగు క్షేత్రములకు వేంచేసి పెరుమాళ్లకు మంగళా శాసనము చేసి తిరుక్కావేరి

                                              41