పుట:DivyaDesaPrakasika.djvu/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భద్రాచలం - 48

ఆంధ్రదేశమునగల సుప్రసిద్ధక్షేత్రము. సీతారాముల సన్నిధి-గోదావరినది. భక్తరామదాసుచే అనేక విధముల అభివృద్ధి చేయబడినది. రామదాసు కీర్తనలచే స్తుతింపబడినది. ఇచట ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు జరుగు శ్రీసీతారామ కల్యాణము జగద్విఖ్యాతమైనది. ఈక్షేత్రమును తిరుమంగై ఆళ్వార్లు సేవించినట్లు పెద్దలు చెప్పుదురు.

మార్గము: ఇది ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం పట్టణానికి 40 కి.మీ.


170