పుట:DivyaDesaPrakasika.djvu/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీతానగరం - 47

ఇది జగత్ ప్రసిద్ధులైన శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారి ప్రధాన ఆశ్రమము. శ్రీస్వామివారి తిరువారాధన చక్రవర్తి తిరుమగన్ వేంచేసిన పుణ్యస్థలము. "యంయం స్పృశ్యతి పాణిభ్యాం యంయంవశ్యతి చక్షుషా స్థావరాణ్యాపి ముచ్యంతే" అనువిధమున తమ శ్రీపాదస్పర్శచేతను; హస్తస్పర్శచేతను, దివ్యమందహాసాంచిత కృపాకటాక్షము చేతను, స్థావర జంగమాది భేదము లేక సర్వులను అనుగ్రహించి భగవత్కృపా పాత్రులను చేయు పరమోదారులు. అభినవ భగవద్రామానుజులైన శ్రీశ్రీశ్రీ జీయర్ స్వామివారి ఆశ్రమమును సేవించి ధన్యులగుట ప్రతి భక్తునకు ఆవశ్యకర్తవ్యము.

మార్గము: విజయవాడకు 5 కి.మీ.


169