పుట:DivyaDesaPrakasika.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూరీ జగన్నాథము - 22

నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌||

జగన్నాథస్వామి-సుభద్రాదేవి-బలరాముడు-నిలచున్నసేవ-తూర్పుముఖము-ఇంద్రవిమానము-; స్థలవృక్షము మఱ్ఱిచెట్టు. మార్కండేయ, వరుణ, రోహిణులకు, ఇంధ్రద్యుమ్న మహారాజునకు ప్రత్యక్షము. ప్రసాదపావనమూర్తి, ఇచట ప్రసాదమును స్పర్శదోషము పాటింపక అతిపావనముగా భావించి స్వీకరింతురు. దానిని బట్టియే సర్వం జగన్నాథం అను సామెతపుట్టినది. ఆషాడ శుద్ధ పాడ్యమినాడు జరుగు రథోత్సవము జగత్ర్పసిద్దము. ఈ స్వామి భారతదేశము యొక్క తూర్పుతీరమున వేంచేసి సర్వులను రక్షించుచున్నాడు. ఈ క్షేత్రమునకు నీలాచలమనిపేరు.

ప్రాచ్యాం దేవం జగన్నాథం భుక్తిముక్తి ప్రదాయకం

మార్గము: ఇది ఒరిస్సా రాష్ట్రములోనిది.

పూరీ జగన్నాధ స్వామి

POORI JAGANNADHA SWAMY

పురుషోత్తమము - 23

సప్త సప్తమ లోకేషు లోకా లోకేచర చరే|
వాప్తి వాప్తి సమం క్షేత్రం ఉత్తమం పురుషోత్తమం

పురుషోత్తమన్ - శ్రీకృష్ణ బలరాములు - మార్కండేయ మహర్షికి ప్రత్యక్షము - వరుణినిచే ప్రతిష్టించబడిన దివ్యస్థలము. నాధమునులు భగవద్రా మానుజులు ఈక్షేత్రమునకు వేంచేసి మంగళాశాసనం కృషిచేసిరి.

మార్గము పూరీ జన్నాధ క్షేత్రమునకు మిక్కిలి సమీపములో కలదు.

158