పుట:DivyaDesaPrakasika.djvu/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ రంగపట్టణము -14

శ్రీరంగనాథస్వామి-శ్రీరంగనాయకి-శయనించినసేవ-కావేరినది. ఈక్షేత్రము శ్రీరంగమువలె కావేరి మధ్య భాగమునందు కలదు. మధ్యరంగమనిపేరు. ఆదిరంగం-శ్రీరంగం-మధ్యరంగం-శ్రీరంగపట్టణం-అంత్యరంగం-పినాకినీ తీరమున గల తల్పగిరి శ్రీరంగనాథులు(నెల్లూరు)

మార్గము: మైసూరు నుండి 15 కి.మీ.

శింజన్‌కోట -15

శ్రీరామచంద్రులు-సీతాదేవి-సీతాదేవి స్నాన ఘట్టము.

మార్గము: శ్రీరంగపట్టణం నుండి 40 కి.మీ.(ఇలివాలా మార్గంలో)

మిధున సాలగ్రామం -16

నరసింహస్వామి సన్నిధి కలదు. భగవద్రామానుజుల శ్రీపాద తీర్థము గల నడబావిని భక్తులు తప్పక సేవింపవలెను.

మార్గము: ఎడత్తురై నుండి 12 కి.మీ.

డేంకిణికోట -17

శ్లో. శ్రీ శైలాద్రివరా త్సమేత్య మునినా కణ్వేవ సంప్రార్థిత:
   జిత్వా తత్పరసంధినం మునికృతం విర్వర్తయన్ సంయమం
   ఆస్తే డేంకిణి నామకే పురవరే పశ్చాద్దమర్బూభృత;
   దేవోనశ్శుభ మాతనోతు నితరాం శ్రీ బేటనాథో హరి:

వివ: బేటరాయస్వామి-సౌందర్యవల్లిత్తాయార్-ఆనందయోగ విమానము-చక్రతీర్థము-నృసింహగిరి-కణ్వమహర్షికి ప్రత్యక్షము. తిరునారాయణపురం అయి అని ప్రసిద్ధులైన అనన్యాచార్యుల వారి మంగళాశాసనం గల దివ్యస్థలము. ఇచట శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి కూడా కలదు.

మార్గము: ధర్మపురి జిల్లా హోసూరుకు సమీపమున గలదు.


మంచిమాట

శ్రీరంగనాథుని ఆపాద చూడము సేవించుచు ఆయన చరణార విందముల యందు వీణాపాణియై నోరార కీర్తించుచుండు తిరుప్పాణి ఆళ్వారులను సేవించుచు జీవితమును ధన్యమును చేసికొనుడు.

                                                     155