పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనుర్విద్యావిలాసము

37


సీ.

గొఱియకొమ్ములు చీరి కుదురుగా సవరించి
        పలకపాళములుగా నిలవరించి,
అగ్రభాగముల కైదాఱంగుళమ్ముల
        కొలఁది తక్కువలుగా గుఱుతుఁజూచి,
అదుకు మాఱుట దాని యదుకు పట్టునఁ గాక
        మెలకువ నటునిటు మించనదికి,
అదికిన ఖండమ్ము లవి రెండు నొకటిగా
        బొత్తి మోపున సరిహత్తఁ గూర్చి,


తే.

యదుకుపై నొక్కటీవల నవలమూఁట
మూఁటదారు ఖండమ్ముల మొసలి వా న
మర్చి లోపల గెఱలూని మసృణరసవి
శేషముల రెండు నొక్కటి సేయవలయు.

149


వ.

ఇట్లు కోదండ శార్ఙ్గఖండంబును, వెలిదండ దారుఖండంబునుంగా
నమర్చి మఱియును.

150


గీ.

ఓదెగొంగనరము లురము పృష్ఠమ్మును
గ్రమ్మునటుల చటులగతి నమర్చి
జేవురలఁది కొలదిచే నార్చి గెజగీర్చి
యొరపు నెరపురంగు లునుపవలయు.

151


గీ.

అదికినపుడు తిన్ననై శలాకీలీల
చక్కఁదనము గులుకు శార్ఙ్గధనువు
ఎండ నెండెనేని కుండలస్ఫురణంబు
నందు వెలికి వలయితాగ్ర మగుచు.

152


సీ.

పదియాఱు పిడియలఁ బరగు దీర్ఘంబై న
        విల్లు యుద్దార్హమై వెలయుచుండు,
పదియేను పిడియల బలు కార్ముకంబు దూ
        రాపాతనంబున కలరుచుండు,