పుట:Delhi-Darbaru.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

శ్రీ రాజ దంపతులు.



మని యాశీర్వదించెను. ప్రార్ధనగీతము పాడిన తరువాత యార్కు ప్రభువు దన భార్యను, విక్టోరియా మహారాణిగారిని, వేల్సు రా కొమారితెను, ఒక్కు- ప్రభ్విని, డెనాళ్ళు రాజదంపతులను ముద్దు గొనెను. మహా రాజియు, తక్కుంగల రాజసమూహమును మిక్కిలి యను రాగముతోఁ బెండ్లి కూఁతును దీవించిరి. తరువాత స్వల్ప కాలములోనే యూరేగింపులతో సందఱును వివాహ భోజనమునకయి బక్కింగ్ హాము' నగరునకు బయలు దేరిరి. ప్రక్కన నుద్యాన వనమందుంగల తుపాకులు గౌరవార్ధముగ గుండ్లు పేల్చెను. లండను నగరమండలి చర్చుల గంట లన్ని యు సంతోషధ్వానముల నిగుడ్చెను. బక్కింగ్హాము నగర ముంగల పధూవరులకై యెదురు జూచుచుండిన జనులు మూకగట్టి - సిలిచి యుండిగి. వీరి కానందము గలుగఁ జేయుటకు నగరు సేరిన కొన్ని నిమేషముల లోపల 3 విక్టో రియా మహారాణియు నామె కుటుంబమును యా సౌధపు బై యంతస్థు నందలిసజ్జున నగుపించిరి. కుర్చీలు దేబడి వారి కమర్పఁబడెను. పదినిముసముల కాలము నవీన దంపతులు సరస సల్లాపము లాడుకొనుచుఁ దమ యవ్వగారి సమీపమునఁ గూర్చుండి. జనులందఱును దాము వేచియున్నందులకు ఫల ముగఁ గన్నులార జార్జి మేరీల జూచి తనివినందిరి. దీనికి బిదప సాధారణముగ నిట్టి వివాహములకు సామాన్యములగు నితర కార్యములును వేడుకలును నడచెను. వివాహము యధా