34
ఢిల్లీ న గ ర చరిత్రము'.
పించుట ప్రౌఢీమతో బ్రదర్శింపఁబడియున్నది. మఱియొక్కెడ
పూమాలలతో నొప్పు చిరుతపులియర్రులును, వేరొక్కెడ
సంకెలలకు వ్రేలఁగట్టఁబడిన గుటలును దృష్టిని దనుపుచున్నవి.
ఇంకొక్కెడ దివ్య మంచక ములును ప్రసూన దామపరంపరలును
బ్రేక్షకుల నాకర్షించుచున్నవి. అన్ని టికంటే మిన్న యయి యొక
స్తంభము కామ ధేనువును గోవత్సంబును జూపఱులముందఱకు
దొబ్బి యిల్లిదే నీయభీష్టములఁ దీర్పఁగల నేనిట నున్న దానను
రమ్మని చీరుచున్నది. మాచదువరు లింతకంటె నపూర్వంబగుఁ
బ్రేక్షణీయము నాశింతురే? ఇంకొక్కటి మాత్ర మీమసీదున
గలదు. ఉత్తరపు గోడన బహిర్భాగమందు రెండన గవాక్షము
పైని శిలమీఁదఁ జక్కఁబడిన కృష్ణజన్మఘట్టము 'సొంపులు
గుఱిపించుచున్నది.
ఇదియంతయు హిందువుల దేవాలయ ముండిన భాగము. ఇక క్రొత్తంగ మహమ్మదీయులు చేర్చిన దేమన సత్యద్భుతముగు కమానుల వరుసలు. ఇవి మసీదునకు పశ్చిమ భాగమున గలవు. వీని పొడవు 885 అడుగులు. ఇందు మూఁడు గొప్పవి; ఎనిమిది చిన్న వి. నట్టనడుమనుండు కమాను వెడలువు 22 అనుగులు; ఎత్తు 58 అడుగులు. దీని కావల నీవల నుండునవి యింత యెత్తే గాని వెడలువునమాత్రము రెండడుగులు గొప్పవి. పఠానులు శిల్పులనుదమ వెంటఁ బెట్టుకొని రాలేదు. కాని శిల్పకళయందభిరుచి గలవారగుట వీరు దమ హైందవ పౌరు