పుట:Delhi-Darbaru.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జుమ్మా మసీదు.

35


లలోని చతురులతోఁ బనినంతయుఁ జేయించుకొనుచుండిరి. కావున మున్ను దేవాలయమును గట్టిన వారలే యీ కమాను. లను గూడ నిర్మించియుందురు. అట్లగుట దేవాలయమందలి యలంకారమే యిచ్చటను గానవచ్చుచున్నది. కాని యిట విగ్రహములకు మారుగ కొరాను గ్రంథమునుండి బహుజాగ రూకతతో నేరఁబడిన వాక్కులుగంపించుచున్న వి. సంపూర్ణతా శక్తితో సూత్తుతమముగు చిత్రరచనా చాతుర్యమునుజూపి తన్మ ధ్యమునఁ బై కెగయుచు గ్రిందికి దిగుచు చక్షురానంద దాయకములగు ధార్మిక వాక్యములను జెక్కి వెట్టిన నేభక్తుని హృదయము ప్రబోధమందదు? ఈ కమానుల ముఖమునఁగాన నగు కొరానువాక్కుల ధోరణిఁజూడ కొరాను భూలోకము నుండి పోయి భగవంతుని దర్శింపుచు భగవంతునుండి భూ ప్రజకు జ్ఞానామృతమును గొనివచ్చుచుండునట్లు తోఁచుచున్న దని యొకానొక మహమదీయుఁడు నుడివియున్నాఁడు.

జుమా మ సీదు.

ఢిల్లీ రాచబాట నవలోకించుచుఁ బురమును జొచ్చుట తోడనె దృష్టి నాకర్షించు ప్రథమవిషయము జుమా మసీదు. భర తవర్షమునం దుత్తమనిర్మాణములలో నిదియునొక్కటి క్రైస్తవు లకు రోముపట్టణమందలి సెయింటుపీటరు చర్చివ లెను, హిందు వులకు ఒరిస్సాయందలి జగన్నా ధాలయమువలెను, మహమ్మదీ యుల కనుక రించున దీ మసీదే. ఆగ్రాయందలి తాజ్ మహలు