పుట:Delhi-Darbaru.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము..

.

పస్తుతపు ఢిల్లీ.

ఢిల్లీ నగరము పంజాబు పరగణాలో యమునానది యొడ్డున నున్నది. ఇది కలక త్తానుండి 956 మైళ్లు, బొంబాయినుండి 982 మైళ్లు, చెన్న పట్టణమునుండి 1100 మైళ్లు. ఇందుగలజన సంఖ్య 1901 సంవత్సరపు జనాభాననుసరించి 208, 575;ప్రస్తుతము 282, 859. ఈపురమున ననేకములగు యంత్రశాలలేర్పడి యుండుటవలన నానాటికీని జనసంఖ్య యెక్కుడగుచున్నది. మన జార్జిచక్రవర్తిగారి అభీష్టము ననుసరించి యిఁక ముందిదియె భరతఖండమునకు రాజధానియగుటంబట్టి మళ్ల నిది తన పూర్వోన్నత్యమును పొంది మరలఁ 'బురోత్తమ” మనిపించుకొనుననుటకు సందియము లేదు.

ప రి శ్రమ లు.

ఢిల్లీ జనుల ముఖ్య వృత్తు లనేకములు. అచ్చట చేతిపనులును మెండు. ఆభరణములుచేయుట, వెండిపని, రాగియిత్తడులయుప యోగము, దంతము పై చెక్కుట, కుమ్మరపని, గుడ్డల నేత, వెండి బంగారు జరీలతో బుటేదారుపని, చిత్ర లేఖనము, వర్ణ లే