పుట:Delhi-Darbaru.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయాజిరావు. III.

271


లతోగాని ఆయాసంఘభాగములతోగాని జనించినవిగావు. అవి మధ్య కాలమున స్వస్వలాభమునకయి తెచ్చి పెట్టుకొనఁ బడినవి. కావున వానిని మనము రద్దుపఱచవలెను. మనము స్వార్థ త్యాగ వైభవము ననుభవింప నేర్చుకొనవలయును.. హీనజనులయిన మనసోదరులను మనంతటివారిని జేయవలయును. ఆ స్వా భావిక మగు విభేదములను దుడిచి వేయవ లెను, వాక్యశూరత్వ మునకంటెఁగార్యశూరత్వమే ఎక్కుడు ఫలప్రదంబనీ గ్రహంచి మనము మనవాక్కులను బరి పాలించుటకు వెనుదీయరాదు" అని నచించెను.

మఱియొక చో ," సంఘమునందు సామాన్య జను లకుఁగల గౌరవమును బ్రాముఖ్యత యును వారు దెలిసికొనునంతటిజ్ఞానము గలవారగునట్లు చేసిన నే తప్ప నిజమును శాశ్వతమును నయిన యభివృద్ధి గలుగఁ జాలదు. మనలో విద్యా వంతులును ధనవంతులునునైన వారు సామాన్యజనులను బ్రబోధించి వారికిఁ బ్రోత్సాహ మొసంగి జ్ఞానమలవడం జేయుటయే ప్రథమక ర్తవ్యముగ నెన్నుకొన నలయునని నా యాశయము. వారు స్వాభివృద్ధికి పాటుపడుటకై వారికి మనము సాహాయ్యము చేయవలయును. వారి పయినాధిక్యమూనుట మాత్రమెప్పుడును తగదు. మనకుఁ బ్రస్తుతము ముఖ్యతమముగ వలసినది సాహాయ్యసం యోగమే (Co-operation)గాని వారి