పుట:Delhi-Darbaru.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'213

ఖండే రావు I: దామాజి'. I.


గుజరాతు సీనుకు ... మొదట 'మహారాష్ట్రులు 1705 వ సంవత్సరమున దండెత్తివచ్చిరి. 1712 న సంవత్సరమున నట ఖండే రావను మహారాష్ట్ర నాయకుఁడు . ప్రబలుఁడయి' "కాన్పిం చెను. అతని యనుమతి లేనిది . గుజరాతుఁజొచ్చు ప్రవాసికుల సొత్తునందు నాలవవంతు నతఁడు."లాగుకొన మొదలిడియెను. మహారాష్ట్రులకును' మహామ్మదీయ చక్రవర్తి ప్రతినిధులకును జరుగు చుండిన విగ్రహమున దీక్ష తోఁ బనిచేసి మహారాష్ట్రుల లోఁ బుట్టిన అంతః కలహములలో ‘సాహోజి' పక్షమగుట వలన నతఁడు సాహోజిచే సేనాపతిగ నియమింపఁబడెను. (1716) నాలుగు సంవత్సరములకుఁ దరువాత ఢిల్లీ పాదుషాహగారగు మహామ్మదుషాహ మహారాష్ట్రులకు గుజరాతునందు చౌతు పన్నును*[1] వసూలు చేసికొనుట కు తరువిచ్చెను. సతారారాజు ప్రతినిధిగ సేనాపతియయిన ఈ ఖండే రావె గుజరాతునందు కార్యమునకు నేర్పఱుపఁ బడెను. ఇట్లుండ 1720న సంవత్సర ప్రాంతమున స్వాతంత్ర్యము నెఱపం బ్రారంభించి యుండిన నైజాముల్ ముల్కునకును దక్కనునకు ప్రతినిధిగ బాదుషాహ గారిచేఁ బంపఁబడియుండిన ఆలింఆలీకును బాలాపురము వద్ద యుద్ధము జరిగెను. అప్పుడాలిం ఆలీకి సాహాయ్యలుగ ననేక మహారాష్ట్ర ప్రభువు లేగియుండిరి. అందును ఖండేరావు సైన్య ములు మహా ధైర్యసాహసములతోఁ బోరెను. ఆతరుణమున నే .........................................................................................

  • అనఁగా చక్రవర్తికి గావలయు పన్ను లో నాలవవంతు పన్ను :