పుట:Delhi-Darbaru.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

హైదరాబాదు సంస్థానము.


మిక్కిలి వ్యయపరమని యెల్లరును అంగీకరించియే యున్నారు. కావున ప్రతి సంవత్సరమును నిలువ యుండుచు వచ్చిన ద్రవ్యము బహుస్వల్పము. 1887-88 లో మాత్రము బీరారుమండలాదా యమునుండి రు 19, 78,000లు నైజూమున కియ్యబడెను. మొత్తముమీఁద చూచినచో 1860- మొదలు 1900 వఱకుగల నలుబది సంవత్సరములకు నైజామునకు సంవత్సరమునకు 9 లక్షుల వంతున నియ్యఁబడెను. ఇదియైనను నైజామునకు మిగిలిన దాయనిన మిగిలినది కాదు. 1900 -01 వ క్షామములలో నైజామున కొక్కదమ్మిడియైనను రాక పోవుట యేగాక బీరారునఁ గలిగిన దుర్భిక్షమును దీర్చుటకుఁ జేయఁబడిన వ్యయముచే బీరారుమండలము ఆంగ్లేయ ప్రభుత్వము వారికి 1,40, 95,608లు అప్పుపడెను. సుభిక్షముగల సంవత్సరములలోని నిలువ దుర్భి క్షముల నపనయింప నుపయోగింప వలయునను ఆచారమును బట్టి ముందు సంవత్సరములలోని నామకార్థపు నిలువను అనుభవింపుచుండిన నైజామా నూటనలుబది చిల్లరలక్షలనిచ్చు కొనవలసిన 'వాఁడాయెను. ఇతియేగాక సర్ సాలార్ జంగం తటివాఁడు మఱియొక రుఁడు మంత్రి హైదరాబాదునకు దట స్థించనందున - పైఁగనిన క్షామములకయియే హైదరాబాదు సం స్థానము కురకు నాంగ్లేయులవద్దనుండి నైజాము రెండుకోట్ల రూపాయి లప్పు పుచ్చకొనవలసిన వాఁడయెను. కావున నైజాము