పుట:Delhi-Darbaru.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లేయుల అభిప్రాయములు.

161


ఉల్-ముల్క్ పనినుండి తీసి వేయఁబడియెను. ఇతని స్థానమునఁ దత్కాలమునకు ఆమ్మద్ ఉల్ ఉముల్ కును దరువాత షంష్ - ఉల్ - ఉమ్రాయును "నేమింపఁబడిరి.

పంష్-ఉల్-ఉమ్రా మంత్రిత్వము వహించిన దైదుమా సము లే గాని ఆపదవి నున్నంత కాల మతని ధరర్మముల నతఁడు చక్కఁగ నెర వేర్చెను. అతఁడు ఆంగ్లేయులకు నైజామియ్యవల సిన యప్పు పైనగు వడ్డీ నెల నెలకును ఇచ్చి వేయఁబడుననియు అస లు వాయిదాలమీఁద సంవత్సరమున కైదులక్షలు దీర్పఁబడు ననియు రెసిడెంటు ద్వారా గనర్నరుజనరలుకు వ్రాయించెను. గవర్నరు జనరలుగారు నైజామునకుఁ దాము ద్రవ్యమిచ్చినది స్నేహభావమున నిచ్చిరనియుఁ గావున నంతయునొక్కమారి చ్చుట కేర్పాటులు చేయవలసినదనియు, బ్రత్యుత్తరమిచ్చిరి. సంష్-ఉల్-ఉమ్రా ముత్రిగనున్నంత కాలము నెల నెలకగు నడ్డీ మొత్తము మాత్రముదప్పక దీర్చఁబడుచుండెను. అయిన నతఁడు నైజాము వ్యయపరుడై నందునఁ దన కేమియుఁ జేయవీలు లేక పోయెనని విసుగుకొని తనపదవికీ - 1849 వ సంవత్సరము మేనెలలో రాజీనామా నిచ్చెను. షంష్-ఉల్-ఉం రా. ముఖ్య మంత్రిగానుండి యన్ని కష్టములకు నోర్చుకొని తన ధర్మమును నిరాతంకముగ నెర వేర్చినందులకు గవర్నరుజనరలుగారు తమ సంతసమును దెలిపిరి.