పుట:Delhi-Darbaru.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

హైదరాబాదుసంస్థానము.


హైదరున కియ్యఁబడిన సన్నదులన్నియు రద్దు చేయఁబడెను. అది వఱకు హైదరు చేతులలో దొరకియుండిన కర్నాటక భాగమంత యను నాంగ్లేయులకు స్వాధీనమాయెను. అచ్చట నైజూముగారి గౌరవమును నిలుపుటకై ఆ భాగమునకు గాను అతనికి నాంగే యులు ఏడులక్షల పన్నును గట్ట నొప్పుకొనిరి. కొండపల్లి దుర్గ మచ్చటి జహగీరుతోఁ గూడ సంపూర్ణముగ వీరిదే యయ్యెను. మొదటిసంధి వలన వీరికి ధృవ కౌలు కియ్యబడిన యైదుమం డలముల గుత్త కొంత కాలము మూఁడులక్షలును తరువాత నేడులక్షులును ఇచ్చులాగున నేర్పడెను. ఆంగ్లేయులు నైజాము హైదరుతోఁ జేరిన "కాలమున నాక్రమించిన కమ్మంమెట్టు వరం గల్' సీమ లతనికి మరల్చఁబడెను. మొదటి సంధిననుసరించి ఆంగ్లేయులు నైజామునకు వలసినప్పుడు దంకుడుల నాయ త్తపఱచి యియ్యవలసిన వారయి యుండిరి. కాని యీసంయం దది మారిపోయెను. వారు దమకు నైజాము నెడఁగల ప్రేమను జూపుట కై సిపాయీల పటాలములు రెంటిని ఆరుఫిరంగులను ఐరోపియనుల యధికారము క్రిందఁ గావలసి వచ్చినప్పుడు పంపనియ్యకొనిరి. కాని వానికగు వ్యయము నైజామే భరింప వలసెను. కర్నాటకపు నవాబు పై ఇతనికి నధికారము ఈసంధి వలనఁ దప్పిపోయెను. సమయాచిత్యము గణింపక హైదరాలీ తో జేరినందులకు నైజామిన్ని విధముల నాంగ్లేయ వర్తక సం ఘమువారి పయిఁ దన కదివఱకుండిన పట్టును బోఁగొట్టుకొనెను.