పుట:Dashavathara-Charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గైకొంచు నెడనెడం ద్రోవకడ్డంబై మెలంగు జలభుజంగంబులం గనుంగొని
దుశ్శకునంబని తలంచుచుఁ జేనొడిసి జిరజిరం ద్రిప్పివైచునెడ ఫణామణులు చె
దరి విస్ఫులింగంబులగములవలెఁ జూపట్టి యేపట్టున నిలువంజాలక మూలమూల
లకరుగు మకరకర్కటకాదిజంతుసంతానంబుల కగుబడబానలసంతాపంబునకుఁ
గొంత చింతించుచు భవిష్యత్కమఠధృతమందరవసుంధరాధరసూచకంబు ల
గుచు గిరులక్రింద నందందఁ గ్రందుకొనుకూర్మంబులు గ్రుంగ శృంగంబుల
మెట్టి లంఘించుచు ఘృతపరిఫ్లుతసముజ్జ్వలదౌర్వజ్వలనజ్వాలికాసంతాపశర్క
రాయితేక్షురసవ్యంజనసమంజసంబు లగుదుగ్ధంబులు గ్రోలుచుం దనివి సాలక
లవణరససంమిశ్రంబు లగుదధిఖండంబుల మెసంగుచు శుద్ధోదకంబుల గండూ
షించుచు హేలావధారితహాలారసపానవేలావిలోలాయితకాలానలకీలాకుల
సమాకులాభీలారుణశోభాలవాలవిశాలలోచనగోళంబులు ద్రిప్పుచు సోలు
చు జంబూప్లక్షాదిద్వీపవృక్షద్విత్రిమాత్రావశిష్టశాఖావలంబనంబునం గొంతవి
శ్రాంతుం డగుచు దివాకరమార్గంబు నిర్గమించి సుధాకరపథం బంటి తారాపథం
బున కెగసి బుధాదిగ్రహంబుల నతిక్రమించి ధ్రువమండలంబు దండకుం జేరి
మహర్లోకపథంబునం బయలుదేఱి [1]ప్రాప్తసంయుగవిలయసమయసముత్క్షిప్త
సప్తసప్తిదీప్తితతప్తు లగుచు నుపరిలోకంబులు వలసలు చేసి మరలి తమతమ
యగారంబులం జేరువారి నాలోకించుచు దాహాదివర్జితులై విరాజిలు వైరాజ
లోకంబగు జనర్లోకంబుఁ బ్రవేశించి యవ్వల శతానందనందనసనకసనందనాది
మునిబృందారకమునిబృందసహస్రారవిందబంధుబంధురప్రభాదురవలోకం బగు
తపోలోకం బస్తోకప్రయత్నంబునం గడచి యాకడం జనిచని.

262


సీ.

కడవన్నెతళుకుబంగరుకోట కెంజాయ సంజకెంజిగిరంగు సవదరింపఁ
దోరంపు ముత్యాలతోరణంబుల కాంతి చొక్కమౌ చుక్కల టెక్కు సూప
జేజేలరాఱాల చెలువంపుగృహపాళి కటికిచీకటిగుంపు గరిమనింప
రాణించు జాతివజ్రాల మేడలడాలు పండువెన్నెలచెన్ను పరిఢవిల్ల


తే.

వివిధమాణిక్యదీపము ల్వెలుఁగుచుండ, స్మరరణశ్రాంతమిథునలోచనసరోరు
హములు ముకుళింప నైశధర్మముల నొందు, సత్యలోకంబు గనుఁగొనె దైత్యవిభుఁడు.

263


చ.

కనుఁగొని విశ్వకర్మకరకౌశలి మెచ్చుచు రాజవీథులం
జనిచని ముందట న్వెలి హజారము వెల్వడి వచ్చుచున్న యా
సనకసనందనప్రముఖసంయములం గని పెద్దకొల్వు దీ
ఱె నలువయంచు నెంచి నడురేయి నిశాంతము సొచ్చి యచ్చటన్.

264
  1. ప్రాక్తనయుగవిలయ