పుట:Dashavathara-Charitramu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

హేమక్ష్మాధరసుస్థిరుండు బలిదైత్యేంద్రుండు వింధ్యావళీ
వామారత్నము రత్నకుంభజలము ల్వంపన్మృషావామన
శ్రీమత్పాదయుగాభిషేచన మొనర్చె న్బ్రహ్మరుద్రాదు లో
హో మేముం గనలేనికీర్తిఁ గనె దైత్యుం డంచుఁ గీర్తింపఁగన్.


క.

క్రవ్యాదవిభుఁడు వామన, దివ్యశ్రీపాదపద్మతీర్థంబు శిర
స్సేవ్యము గావించి బుధ, స్తవ్యమతిని ధారవోయు సమయమునందున్.

109


తే.

వామనుఁడు దర్భగిండిలో వారిధార, కడ్డమైయున్న శుక్రుని యక్షిఁ బొడువ
మిట్టిపడి కన్ను వోయిన లొట్టవోయె, ననుచు నవ్వుచుఁ జేసాచి యడుగుటయును.

110


క.

క్షమ మూఁడడుగులు బలి యు, త్తమభక్తి "సదక్షిణం సతాంబూలం తు
భ్యమహం సంప్రదదేదం, నమమ” యనుచు ధారవోసె నలినాక్షునకున్.

111


మ.

పెరిఁగె న్వామనుఁ డంత దంతిపొడవై పృథ్వీధరం బంతయై
శరదంభోరుహమిత్రశీతకరనక్షత్రగ్రహస్వర్మహా
స్ఫురితుండై జనలోక మవ్వలిజగంబు న్సత్యము న్మించుచున్
హరి దంతంబులు నిండి మెండుకొనె నత్యాశ్చర్య మేపారఁగన్.

112


సీ.

పద్మరాగప్రభాభాసమానకిరీట మరవిందజాండకర్పరము నొరయ
శతయోజనాయతశతపత్రపత్రజైత్రము లైన విపులనేత్రములు మెఱయఁ
బరిపూర్ణచంద్రబింబసహస్రవిస్త్మృతం బగుమోము మందహాసంబు దొరయ
దశదిగంతవ్యాప్తతతబాహువులు శంఖచక్రాదివివిధశస్త్రములు నెరయ


తే.

కవదొనలు నక్రకుండలకౌస్తుభములు, వైజయంతియు లక్ష్మీ శ్రీవత్స కాంచ
నాంబరము లొప్ప బ్రహ్మాండ మనెడు భరణిఁ, కస్తురియుఁబో లెఁదగెఁ ద్రివిక్రమవిభుండు.

113


మ.

హరి యీరీతిఁ ద్రివిక్రమాకృతిని బ్రహ్మాండంబునన్ నిండి యా
వరణాంగంబుల సర్వలోకములు మించన్ బ్రహ్మరుద్రాదిని
ర్జరు లగ్గింపఁగ నందముఖ్యసుభటవ్రాతంబు సేవింప దు
ర్భరతేజంబున రాజిలన్ బలి కృతార్థంమన్యుఁ డయ్యెన్ మదిన్.

114


వ.

అపుడు.

115


శా.

వినుఁ డోహో జనులార విష్ణుఁ డొకఁడే విశ్వాధికుం డాద్యుఁడుం
గనుఁగొన్నారె కదా మహామహిమ మింకన్ భక్తితోఁ గొల్వుఁడీ
యనుచుం జాటుచు జాంబవంతుఁడు సముద్యద్భేరి మ్రోయించుచున్
వినరా నిర్వదియొక్కమా ర్వలగొనెన్ విష్ణున్ విరాడ్విగ్రహున్.

116


మ.

అరవిందాయతనేత్రుఁ డంతట నతుల్యంబైన త్రైవిక్రమ
స్ఫురణన్ మించఁ బదాంబుజం బొకటిచే క్షోణీస్థలిం గొల్చి యం