పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనుటకై చెంతనున్న యొకచెఱువునకుఁ బోఁగా, నందు నీరు లేకపోయెను. అప్పు డీకవి ఈక్రిందిపద్యము నాశువుగాఁ జెప్పెను.

క. సిరిగలవానికిఁ జెల్లును
   దరుణులు పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్
   దిరిపెమున కిద్దరాండ్రా
   పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్.

పల్నాటిసీమలోని మిద్దెలనుగుఱించి చెప్పిన పద్యము.

ఉ. మిద్దెలు మిద్దెలన్న మనమేడలకంటెను సొంపునించి బల్
   నిద్దపుసౌధజాలముల లీలవెలుంగునటంచు నెంచి నే
   నద్దిర! మోసపోతి సకలాభరణమ్ము లమర్చి కస్తురిన్
   దిద్ది కచంబుఁ జెక్కినసతిం బురుడించును మిద్దె లిచ్చటన్.

ఒకానొకసమయమున శ్రీనాథున కేదో జబ్బు సంభవింపఁగా వైద్యు లులిమిరిచెక్కతో నౌషధ మిచ్చి రొట్టె పథ్యము పెట్టి, గాలి తగులనిచోడఁ బరుండవలయు నని చెప్పిరఁట. ఆతఁ డట్లే యొకచీఁకటిగదిలోఁ బాధతోఁ బరుండి, యాసమయమునఁ జెప్పుకొనిన పద్యము.

చ. ఉలిమిరి చెక్కయున్ మిగులనుక్కయుఁ జప్పని రొట్టెముక్కయున్
   మలినపుగుడ్డలున్ నులుకమంచపుఁగుక్కియుఁ జీకటింటిలోన్
   దలచిన రోఁతవచ్చు నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖఁమౌ
   బలివెల వారకాంతల .......... బదివేల దండముల్.

శ్రీనాథుఁ డొకమంగలిసుమంగలిని వర్ణించిన వర్ణనము

ఉ. ముంగురు లుంగరాలు, చనుమొగ్గలు బంగరుబొంగరాలు, క
   న్నుంగవ గండుమీలు, సుమనోవృతమై తగువేణిబంధమున్