నింగులువారు చీరె కటిసీమపయి న్నటియింప వచ్చె న
మ్మంగలివారికాంత విటమానసమంతయుఁ జూరఁ బుచ్చుచున్.
కంసాలిస్త్రీపైఁజెప్పిన పద్యము
క. అంసాలంబితకచభర
హంసాలస మందగమన హరిణాంకకళో
త్తంసాలంబిత కుచభర
కంసాలవిధూటి యెదుటఁ గానంబడియెన్.
శ్రీకాకుళము తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు చెప్పినది.
శా. హైమగ్రావనితంబభూరికచభారభీర లున్మత్తలున్
గామాంధల్ వెలనాఁటికోడెవిధవల్ కాకుళ్ళతిర్నాళ్లలో
మామాంధాతయు, భీమసేనుఁడు, హిడింబానందనుం డోపితే
నేమోకాని తెమల్పఁజాల రితరుల్ హేలారతిక్రీడలన్.
కురువజాతిస్త్రీపైఁ జెప్పిన పద్యము
[1]క. కురువది కంబడిఁ గట్టుక
కఱకున కోర్వంగలేక గజ్జలదనుకన్
బరికీ బరికీ బరికీ
బరికీ మరునిల్లు బట్టబయలుగఁజేసెన్.
కవిత్వముఁ జెప్పుమని తన నూఱక బాధింపఁగా విసికి, త్రోవను బోవుచున్న యొకగాడిదను జూచి యీక్రింది పద్యమును జెప్పెనఁట. అందుపై నాపృచ్ఛకులు సిగ్గిలి శ్రీనాథుని జోలికిఁ బోక మిన్నకుండిరఁట.
- ↑ ఈజాతివాండ్రు గొఱ్ఱెయున్నితో గొంగళ్ళ నేయుదురు. వారు గట్టుకొనుట కట్టిబట్టలే యుపయోగింతురఁట.