పుట:Chandragupta-Chakravarti.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

చంద్రగుప్త చక్రవర్తి


పాటలి దుర్గము

క్రీ. పూ. 490 వ ప్రాంతమున అజాత శత్రుఁడను వాఁడు మగధ రాజయ్యెను. ఇంతకుఁ బూర్వము పాటలి యనునది గంగకు దక్షిణతీరమున నుండిన చిన్నపల్లె. ఆ నదికి నుత్తరమున లిక్షవి వంశజులగు రాజుల ప్రబలమైన రాజ్యముండెను. ఆ రాజులు తన రాజ్యమునకు నేమియు నాపద కలుగచేయ కుండగ వారిని అడఁచియుంప వలయునని అజాత శత్రుఁడు పాటలి గ్రామమున నొకదుర్గమును కట్టించెను. రాజభృత్యులు దుర్గమును నిర్మించుచుండు కాలమున గౌతమబుద్ధుఁడు అచటికి వచ్చెను. అతఁడా దుర్గమును చూచి యందునుగుఱించి యిట్లు భవిష్యత్తు చెప్పెనఁట. "మిక్కిలి విఖ్యాతి చెందు స్థలములలోను, నలుదిశలనుండి వర్తకమును ఆకర్షించినందున పేరొందు పట్టణములలోను ఇది ముఖ్యమైనది కాఁగలదు, కాని యీ పట్టణమునకు అగ్ని, జలము, అంతఃకలహము అను మూఁడు విపత్తులు సంభవించును.”

ఉదయనుఁడు అజాత శత్రుని మనుమఁడు. ఇతఁడు కీ. పూ. 450 వ ప్రాంతమున రాజయ్యెను. ఇతఁడు పాటలి దుర్గము నొద్దనే క్రీ. పూ. 434 వ ప్రాంతమున పాటలీపుత్ర పట్టణమును గట్టించెను. ఇదియే భగవాన్ బుద్ధదేవుని భవిష్యత్తు ననుసరించి వేయి సంవత్సరముల వఱకును హిందూదేశము యొక్క కంఠమణివోలె భ్రాజిల్లెను.

ఇంతకుఁ బూర్వము మగధ రాజ్యమునకు రాజగృహము రాజధానిగ నుండెను. ఉదయనుఁడు రాజధానిని పాటలిపుత్రము