పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధికార్లందరూ ఈ పద్ధతిలో పోలేదు. తిరుసభలో విపరీతమైన లోకాడంబరత్వం కన్పిస్తుంది. తిరుసభ అధికారుల్లో పదవీ వ్యామోహం, సంపదలపట్ల ప్రీతి, ఆడంబర ప్రియత్వం, అధికార గర్వం, లౌకిక విలువలపట్ల మోజు మొదలైన దురుణాలు కొట్టవచ్చినట్లుగా కన్పిస్తాయి. చాలమంది ఈ సత్యాన్ని అంగీకరిస్తారు. ఈ పద్ధతి తిరుసభకు ఎంతమాత్రం తగదు.
క్రైస్తవ శాఖలన్నీఐక్యంగావాలంటే పోపుగారి ప్రధానత్వం వుండవచ్చు. కాని ఆ ప్రధానత్వం నిజంగా సేవారూపంలో కన్పించాలి. అధికార రూపంలో చూపట్టకూడదు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి నిజమైన సేవకుడుగా మెలిగే పోపుగారినీ పీఠాధిపతులనూ లోకం అంగీకరిస్తుంది.

3. క్రైస్తవ సమైక్యత


 
రెండవ వాటికన్ సభకు పూర్వం నుండే క్యాతలిక్ తిరుసభ సమైక్యత కొరకు కృషిచేస్తూంది. ఐతే ఈ సభ ఈ కార్యాన్ని మరింత విస్తృతం చేసింది. లూతరెన్సు, అంగ్లికన్సు, ఆర్తోడోక్స్ క్రిష్టియన్సు మొదలైన క్రైస్తవ సమాజాలన్నీసమైక్యత కోరుతున్నాయి. ఎంతో కృషికూడ చేస్తున్నాయి. కొన్ని అంశాల్లో క్యాతలిక్ సమాజానికి ఈ యితర సమాజాలకి ఏకాభిప్రాయం కుదిరింది. కొన్ని ముఖ్యాంశాల్లో ఇంకా కుదరలేదు. మొత్తంమిద ఆత్మశక్తివల్ల క్రైస్తవ శాఖలన్నీ పూర్తిగా కాకపోయినా చాలవరకు కలసిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి ఇంకా కొంతకాలంపట్టవచ్చు. కాని ఈ సమైక్యత మాత్రం చాలవరకు సిద్ధించి తీరుతుంది. క్యాతలిక్ తిరుసభ మాత్రం పైన మనం పేర్కొన్న సేవామార్గంలో పోవాలి. చీలిపోయిన క్రెస్తవ శాఖలన్నిటినీ ఆకర్షించేది ప్రత్యేకంగా ఈ సేవాగుణమే.

ప్రార్ధనా భావాలు



1. తిరుసభలోని విశ్వాసులు ఈలోకంలో యాత్రికుల్లా జీవించాలి. ఈ భూమిమిూద మనకు స్థిరమైన పట్టణం ఏమిలేదు. మన మందరమూ రాబోయే మోక్షపట్టణం కోసం ఎదురుచూడాలి - హెబ్రే 13,14 డయెగ్నీటస్ లేఖ చెప్పినట్లుగా, క్రైస్తవులు ఈ లోకంలో జీవిస్తున్నా ఇది తమలోకం కాదో అన్నట్లుగా జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్నావారు పరలోక పౌరులుగా వుండాలి, వారికి తాము వసించే ప్రతిదేశం కూడ ప్రవాసదేశం కావాలి.