పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిమితమై వుంటాయి. వాళ్ళు క్రీస్తు పేరుమిదుగా బోధిస్తారు. కనుక విశ్వాసులు ఈ బోధలను పూర్ణహృదయంతో స్వీకరించాలి.

2. బిషప్పు యాజకుడు. తన మేత్రాసనంలో అతడు ప్రధాన యాజకుడు. అభిషేకంద్వారా అతనికి పరిపూర్ణమైన యాజకత్వం లభిస్తుంది. దీనిద్వారా అతడు ప్రజలకు క్రీస్తు రక్షణభాగ్యాలను పంచిపెట్టే గృహనిర్వాహకుడు ఔతాడు. మేత్రాసనంలో దైవార్చనను క్రమబద్ధం చేసేదీ, వ్యాప్తి చేసేదీ అతడే.

దివ్యబలి ఆరాధనలో అధ్యక్షుడు అతడే.ఆయా విచారణల్లో గురువుల పూజబలులు అర్పించేపుడు అతని ప్రతినిధులుగానే అర్పిస్తారు. అవసరమైనప్పడు బిషప్పు ఒక గురువుకి పూజబలిని అర్పించడానికీ అనుమతిని నిరాకరించవచ్చు.
బిషప్పు ముఖ్యంగా ప్రధాన యాజకుడు. మేత్రాసనంలోని విచారణలు స్థానిక తిరుసభను సూచిస్తాయి. మేత్రాసనం విశ్వవ్యాప్తమైన తిరుసభను సూచిస్తుంది. కనుక పీఠాధిపతి తన మేత్రాసనానికంతటికీ, ఒకవిధంగా విశ్వ తిరుసభకీ కూడ పూచీపడతాడు. 

మామూలుగా భద్రమైన అభ్యంగనాన్ని ఇచ్చేది పీఠాధిపతే. గురువులకు పాపసంకీర్తన దేవద్రవ్యానుమానాన్ని జరిపించే అధికారాన్ని ఇచ్చేది అతడే గురువుని తన మేత్రాసనానికి చెందినవాడ్డిగా చేసేదికూడ అతడే

అతడు తన మేత్రాసనంలోని మందకొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి. ఆదివారాల్లోను అప్పుపండగల్లోను వారి శ్రేయస్సు కొరకు పూజబలి నర్పించాలి. అతడు పవిత్రంగాను వినయంగాను సరళంగాను సోదరప్రేమతోను జీవిస్తూ, తన మందకు ఆదర్శంగా వండాలి.

3. బిషప్పు నాయకుడు. పీఠాధిపతి తన మేత్రాసనానికి ప్రధానకాపరి, లేక నాయకుడు. అపోస్తలులకు వారసుడు కనుక బిషప్పు తన మేత్రాసనంలో అన్ని అధికారాలు పొందుతాడు. అతడు కేవలం పాపగారికి ప్రతినిధిగాకాక, క్రీస్తు ప్రతినిధిగానే తన మేత్రాసనాన్ని పరిపాలిస్తాడు.

కాని మేత్రాసనంలో అతని అధికారం పెత్తనం చలాయించే రూపంలో వుండకూడదు. అతడు కాపరిగా, తండ్రిగా, సేవకుడుగా ప్రజలకు పరిచర్యలు చేయాలి. అంతేగాని సేవలు చేయించుకొనేవాడు కాకూడదు.

తిరుసభలో అధికారం సేవకొరకు ఉద్దేశింపబడిందని చెప్పాం. బిషప్పు అధికారంగూడ ఈ సేవకొరకేవుంది. సేవకుడూ మంచికాపరీఐన క్రీస్తే పీఠాధిపతికి ఆదర్శం.