పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పీఠాధిపతులు క్రీస్తు అధికారంలో పాలుపొందుతారు

పీఠాధిపతుల పదవి తిరుసభలో అతిప్రాచీనమైనది. వీరిద్వారానే తిరుసభలో అపోస్తలులతోడి సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఇరెనేయస్ వేదశాస్త్రి చెప్పినట్లుగా "తొలి ప్రేషితులు స్వయంగా నియమించిన వారసుల ద్వారాను వారి వారసులద్వారాను తిరుసభలో ఆ మొదటి ప్రేషితుల సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది.”

బిషప్పులు తొలి ప్రేషితులతో నేరుగా సంబంధం కలవాళ్లు, వీళ్లు ఆ ప్రేషితుల బోధనే కొనసాగించి ప్రజలను దైవరాజ్యంలోనికి చేర్చారు. అపోస్తలుల చర్యలు 20,28, తీతు 1,6-9 వీళ్ళ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి. తిరుసభ నాల్లులక్షణాల్లో వొకటి, తొలి ప్రేషితులతో సంబంధం కలిగివుండడం, వారికి వారస సమాజమై వుండడం. ఈ కార్యం బిషప్పల ద్వారానే నెరవేరుతుంది.

మేత్రాణులనుగూర్చి రెండవ వాటికన్ సభ ఈలా బోధించింది, క్రైస్తవ సమాజంలో బిషప్పులు క్రీస్తు స్తానంలో వుంటారు. క్రీస్తు పేరుమిదిగా కార్యాలు నిర్వహిస్తారు. నేడు క్రీస్తు బిషప్పులద్వారాను వారి అనుచరులైన గురువులద్వారాను తన వుద్యమాన్ని కొనసాగించుకొనిపోతాడు. క్రీస్తు ప్రతినిధులుగా, రాయబారులుగా మేత్రాణులు ఆయా స్థానిక తిరుసభలను పరిపాలిస్తుంటారు. వీరిద్వారానే క్రీస్తు ఆయా తిరుసభల్లోని క్రైస్తవుల్లో ప్రత్యక్ష

మౌతూంటాడు.

మంచి కాపరియైన క్రీస్తు స్థానంలో వుండే ఈ పీఠాధిపతులపట్ల విశ్వాసులు ప్రేమభావంతో మెలగాలి. తిరుసభ క్రీస్తుకీ, క్రీస్తు తండ్రికీ అంటిపెట్టుకొని వున్నట్లే విశ్వాసులు కూడ తమ పీఠాధిపతికి అంటిబెట్టుకొని వుండాలి. అతన్ని తండ్రినిలాగ గౌరవించాలి

పీఠాధిపతులు క్రీస్తు స్థానంలో వుండి విశ్వాసులకు అతన్ని ప్రత్యక్షం చేసేవాళ్లు గనుక, క్రీస్తు మూడు లక్షణాలైన ప్రవక్తృత్వం, యాజకత్వం, రాజత్వం వారికికూడ సమృద్ధిగా లభిస్తాయి. ఈ లక్షణాలద్వారానే వాళ్ళ క్రీస్తు అధికారంలో పాలుపొందుతారు.

1. బిషప్పు ప్రవక్త, సువిశేషబోధ పీఠాధిపతి ముఖ్యకార్యాల్లో వొకటి. బిషప్పకి అభిషేకం జరిగేప్పడు నూత్నవేదాన్ని అతని తలమిూద పెడతారు. అతడు ప్రధానంగా దైవరాజ్య బోధకుడని దీని భావం. తొలిపేషితులు పవిత్రాత్మ దిగివచ్చినపుడు వాక్యక్తిని పొందింది ఈ బోధకొరకే - అచ 2,4.

బిషప్పుల బృందం తమకు శిరస్సుయిన పోపుగారితో కలసి బోధించిన వేదసత్యాలకు పొరపాటుపడని వరం వుంటుంది. బిషప్పల బోధలు నైతిక విశ్వాసరంగాలకు