పుట:Bhoojaraajiiyamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

భోజరాజీయము ఆశ్వా 6


మానము వెలి యగు ప్రాణము
మానినులకు నేమి జాతి మహి నూహింపన్.

84


క.

అని తలంచి యబల దూతీ
జనముల కి ట్లనియెఁ 'గొంత సైరణ వలదే
కనుమఱుఁగు లేక యూరక
తన వలసినచోట్ల మెలఁగుతరుణులు గలరే.

85


ఉ.

ఎప్పుడు ప్రొద్దు గ్రుంకెడినొ యించుక సైపుఁడు మీనృపాలుతోఁ
జెప్పుఁడు వేగ మేల కడుఁ జేరువ నున్నది కార్య' మంచుఁ దా
నప్పని కియ్యకొన్నయటు లాడినఁ బోయిరి వారు, నాటిరే
యప్పటుబుద్ధిబుద్ధియుతు లాడట మెచ్చఁ దొఱంగె దేహమున్.

86


క.

పుడమి నపప్రథ యగునెడఁ
బడతికి దేహంబు విడువఁ బాడియ కాదే
సడి కంటెఁ జావు మే లను
నొడువు పురాతనము గాక నూతనపదమే.

87


వ.

ఇ ట్లాసతి మృతి పొందుట విని యమ్మనుజేంద్రుం 'డిది యెట్టి పతివ్రతయొ
కాక నాచేసినధౌర్త్యంబునకు లజ్జించి ప్రాణంబు లుజ్జగించె' నని పశ్చాత్తా
పంబు నొందుచు నెట్టకేలకు నారాత్రి గడపి మఱునాఁడు దానికి నగ్నిసంస్కా
రంబు సేయ నియోగించె, నావృత్తాంతంబుఁ గర్ణాకర్ణి నాకర్ణించి వంజరుం
డది తన యింతియ కాఁ బోలు నని యాందోళించుచు వచ్చి చూచి నిశ్చయం
బగుటయు శోకాక్రాంతుం డయి.

88


చ.

'నలినదళాక్షి! నీవు నలి నావెనుకం జనుదెంచి నాకుఁ బే
రెలమి యొనర్చి తిప్పు డిటు లీ వమరావతికిం జనంగ నే
నిలుచుట పంతమే, యిపుడు నీ వెనుకం జనుదెంతు' నంచుఁ బౌ
రులు వెఱఁ గందఁగా నుఱికె స్రుక్కక వంజరుఁ డాచితాగ్నిలోన్.

89


వ.

ఇ ట్లావిప్రశాపంబునకు ననురూపంబుగా నతండు మృతుం డగుటయు, నా
వేశ్యయు 'నానిమిత్తంబై కదా వీ రిరువురు నిట్లై' రని తాను నయ్యగ్ని
యందు కూలె; నమ్మువ్వురి మరణంబులకుం గారణంబై యుండి యే నూరు
కుండుట ధర్మంబు గాదని దాసియుం దదనుగమనంబు చేసె నంతయు విని