పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూడవ అంకము

మొదటి రంగము

(దేవేంద్రు నింటిలో నొక్కడే పచారు ఛేయును)

దేవే--ఒక ఆపద గడవకముందే వేరొకటి దాపురించినది. ఒక కెరటము మీద మరొకటి, కాలుజారి కొట్టుకొనిపోవుచున్నప్పు డెవ రాపగలరు? ఒకదానిమీద నొకటి. విరామమే లేదు నిర్భర మగుచున్నది.... అదిగో నా భార్య వచ్చుచున్నది. రానీ, మనసు రాయి చేసికొంటి. ఇక నేమి ఛేయగలదు?

(మానస వచ్చును)

దేవే--ఔను. కాని పోయిది.

మాన-- మీ రేమియు చేయలేదే?

దేవే--లేదు.

మాన--చూచుచు నిలుబడితిరా?