ఈ పుటను అచ్చుదిద్దలేదు
28
[అం 4
భారత రమణి
--రెండవ రంగము--
--(నడుత్రొవలొ భక్తగణము)--
హరి-- ఓరీ, ప్రభువుగారి భోగట్టా తెలియనే లేదు.
వినో--ఔను, ఏదో విశేష ముండవలయు
శంక--ప్రభువుగారి పంధ మరిన ట్లున్నది.
నవీ--మహాప్రబూ! ముమ్మువీడి ఎట బోయితిరి!
హరి--అయ్యో! వీడు కంట నీరుబెట్టు చున్నాడు!
నవీ--గురువుగారు నాకేదైన పని నిప్పిందెనని పల్కిరి. అయ్యో! గురువరా, ఇప్పు డెందుంటిరి!
హరి--అయ్యో! పాపము ఎంత దురదృష్టవంతుడవు.
వినో--బెంగ పెట్టుకొనకు, నవీనా.
నవీ--ఊరంతయు వెదకి ప్రభువుగారి పత్తా గంటినా
శంక--ఏమి చేయుదువు?
నవీ-- నాతృప్తితీర రెండిచ్చుకొందును/.
హరి-- ఏమిరా! అదేమి?
నవీ--ఎంత చాకిరీ చేసినాను! అంతయు నిష్పలము.
వినో--విసిగి వేసారి నిరాశ చెందకుము భక్తుల వాంచితముల ప్రభువువారు నెరవేర్చకపోరు.
శంక--వారిలీలలు అగమ్యగోచరములు!
(నవ్వుచు కేదారుడు వచ్చును
కేదా-- అహ్హహ్హహ్హహ్హ!