పుట:Bhagira Loya.djvu/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

లోని స్త్రీ పురుష చిత్రమండల మంతా నా వైపే కరుణ హాసావలోకనములతో పరిశీలిస్తున్నది. నా మంచానికి దగ్గిరగా మహాగురువు సత్యశీల భిక్షాచార్యులవారు కాలాతీతమైన స్వరూపంతో, పరమదయను ప్రసరించే వెన్నెలలు నింపే చూపులతో, ఆ ముదుసలి పెదవుల వరపూరితమైన నవ్వుల వెలిగిపోతూ వుండగా చూస్తూవున్నారు.

మత్తు నెమ్మది నెమ్మదిగా విడిపోయి బుద్ధి నిర్మలమై లోకజ్ఞానమువచ్చి చటాలున లేచి నిలుచుంటిని. పడబోయిన నన్ను మా వృద్ధదాసి పట్టుకొని “ఆచార్యులవారికి నమస్కారము చేయి తల్లీ,” అని ఉపదేశించింది.

ఆ వృద్ధాచార్యుల పాదాలకడ మోకరిల్లి పోయినాను.

“అమ్మాయీ! నీ దీక్షకు చాలా సంతోషము. ఎందుకమ్మా శిల్పమంటే నీకింత మమకారము?”

“స్వామీ! .......”

“ఊరడిల్లి చెప్పమ్మా, తల్లీ! తొందరలేదు.”

దాసీజనము భక్తితో కొనివచ్చి అర్పించిన పీఠముపై శాంతపవిత్రులైన ఆ వృద్ధ భిక్షులు అధివసించినారు. ఆయన కడనే తలవంచి కూరుచున్నాను.

నా గొంతులో నుండి వినబడీ వినబడని స్వరము మాత్రమే ప్రవహించినది.

“స్వామీ! చిత్రకళ నేర్చికోని నాడు నా జన్మం వృథా! నా పూజ నుసి అయిపోతుంది. నే నింక తీరని

16